Akhanda: అల్లు అరవిందే కాదు ఎవరొచ్చినా ఓకే అనేవాడిని..!: బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. గతేడాది డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయ ఢంకా మోగిస్తూనే ఉంది.
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. గతేడాది డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ను నిర్వహించింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ, బోయపాటి శ్రీను, శ్రీకాంత్ సమాధానాలిచ్చారు. ఆ విశేషాలివీ..
* ప్రస్తుతం.. సినిమాలు థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శితమవట్లేదు. అలాంటిది ‘అఖండ’ 50వ రోజుకి చేరుకుంటుంది. దానికి కారణం?
బోయపాటి శ్రీను: మంచి ప్రయత్నం, కొత్తదనమే ఇందుకు కారణం. తెరపై ఇంతకుముందెన్నడూ చూడని దాన్ని చూపిస్తే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అనే దానికి మంచి ఉదాహరణ ఈ సినిమా. ఈ చిత్రాన్ని చాలామంది మూడునాలుగు సార్లు చూశారంటే రీజన్ అదే. సామాజిక అంశంతోపాటు దైవత్వాన్ని సరైన రీతిలో చెప్పటంతో అందరినీ ఆకట్టుకుంది.
* అన్ సీజన్లో ‘అఖండ’ను తీసుకొచ్చారు. అంత నమ్మకం ఏంటి?
బోయపాటి శ్రీను: కథపైనే నమ్మకం. ‘అఖండ’.. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన పెద్ద సినిమా, కమర్షియల్ సినిమా, మాస్ సినిమా, దైవాత్మిక సినిమా.. ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్న సినిమా. మా చిత్రాన్ని మేం నమ్మాం. ఏడారిలో విడుదల చేసినా ఆడుతుందనే ధైర్యం మాది.
* అఘోరాల ఆహార్యం దాదాపు శివుడిని పోలి ఉంటుంది కదా! సినిమాలో దర్శకుడు మిమ్మల్ని అలా చూపించలేదెందుకు?
బాలకృష్ణ: ముందు నన్ను నేను గుర్తుపట్టాలి కదా (నవ్వులు). ఇలాంటి ప్రయోగాల విషయంలో స్టార్లు, నటులు అనే కేటగిరిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే స్టార్లతో ఎప్పుడూ ప్రయోగాలు చేయకూడదు. అప్పటికీ అఘోరా పాత్ర కోసం దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డారు. శివతత్వం అంటే రౌద్రమే కదా. దానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాం.
* మీరు.. మీ కెరీర్ ప్రారంభంలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే ఎనర్జీతో ఉన్నారు. ఆ రహస్యం ఏంటి?
బాలకృష్ణ: రహస్యమంటూ ఏం లేదండి. ఎప్పుడూ కొత్తగా చేయాలనే తపనే నన్నలా ముందుకు నడిపిస్తుంది. అందుకు తగ్గట్టే అవకాశాలు వచ్చాయి. నాకు నా పనిమీదే తప్ప వేరే వాటిపై ధ్యాస ఉండదు. నేనెన్ని చిత్రాల్లో నటించానో, నా సినిమాలు ఎంత వసూళ్లు సాధించాయో అనే విషయాల్ని నేను పట్టించుకోను. నా నిర్మాతలు బాగుండాలనే ఉద్దేశంతో సినిమాను త్వరగా పూర్తి చేయాలనుకుంటా. ప్రతిరోజూ నాన్నగారి (నందమూరి తారకరామారావు) సినిమా ఏదోటి చూసే పడుకుంటా. అవే నాకు స్ఫూర్తినిస్తుంటాయి. తెల్లవారుజామునే నిద్రలేచి వ్యాయామం చేస్తుంటా.
మధ్యలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణ దేన్నీ తనలో దాచుకోరు. ఉన్నది ఉన్నట్టు, మాట్లాడతారు. అందుకే ఆయన అంత ప్రశాంతంగా ఉంటారు. ఆయనకు ఏది అనిపిస్తే అది చేసేస్తాడు, ఆ క్షణంలో ఎలా బతకాలో అలా బతికేస్తాడు. అదే ఆయన ఆరోగ్య రహస్యం’’ అని తెలిపారు.
* ‘అఖండ’తోపాటు ‘అన్స్టాపబుల్’ షోతోనూ మంచి విజయం అందుకున్నారు. అసలు వ్యాఖ్యాతగా ఎలా ఒప్పుకున్నారు?
బాలకృష్ణ: అదంతా యాదృచ్ఛికంగా జరిగింది. ఓసారి నిర్మాత అల్లు అరవింద్ ‘‘ఓ కార్యక్రమం రూపొందించాలనుకుంటున్నాం. మీరు హోస్ట్గా చేస్తే బాగుంటుంది’’ అని అన్నారు. కొత్తదనాన్ని కోరుకునే మనిషిని కాబట్టి వెనకాముందూ ఆలోచించకుండా ఓకే చెప్పా. నాన్నగారిలానే నేనూ అడ్వాన్స్డ్గా (భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని) ముందుకెళ్తుంటా. ‘అన్స్టాపబుల్’ ఈ ప్రయత్నంలో భాగమే. అరవింద్గారే కాదు ఇదే కాన్సెప్ట్తో ఎవరొచ్చినా నేను ఒప్పుకునేవాడ్ని. నటుల జీవితాల్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం అగ్రస్థానంలో నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.
* మీ మంచితనం ‘అన్స్టాపబుల్’ షోతో ప్రేక్షకులందరికీ తెలిసింది. ‘బాలయ్యది ఇంత గొప్పమనసా’ అని అంతా అనుకుంటున్నారు. ఈ విషయాలు దృష్టికి వచ్చాయా?
బాలకృష్ణ: నేను మంచివాడిననే అభిప్రాయం ప్రేక్షకులకు ఎప్పటి నుంచో ఉంది. కొట్టించుకునేవాడు ప్రేమతో కొట్టించుకుంటే నేనేం చేయను (నవ్వులు). ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా నా దృష్టికి వచ్చాయి.
* బన్ని (అల్లు అర్జున్), బాలయ్య, బోయపాటి (బీబీబీ).. క్రేజీ ప్రాజెక్టును ఆశించొచ్చా?
బోయపాటి శ్రీను: ప్రయత్నిద్దాం. ఏదీ జరగదు అని పొరపాటున కూడా అనుకోవద్దు. ఏది.. ఎప్పుడు.. ఎలా జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.
* బాలకృష్ణలాంటి మాస్ హీరోతో హైందవ ధర్మం, ప్రకృతి గురించి చెప్పించాలనే ఆలోచన ఎవరిది?
బోయపాటి శ్రీను: మా కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సోషల్ ఎలిమెంట్తో విజయం అందుకున్నాయి. మళ్లీ అదే నేపథ్యంతో వస్తే ఏం బాగుంటుందని కొత్త పాయింట్ చెప్పాలనుకున్నా. ఆ మార్పే ఈ రోజు ‘అఖండ’ విజయాన్ని అందించింది.
* ఈ చిత్రానికి సీక్వెల్/రీమేక్ ఏదైనా సిద్ధం చేస్తున్నారా?
బోయపాటి శ్రీను: కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. కొనసాగింపు చిత్రానికి కావాల్సిన లీడ్ అఖండలో ఉంది. అయితే అది ఎప్పుడనే సంగతి ఇప్పుడు చెప్పలేను. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తా.
* ఈ సినిమాలోని చాలా సంభాషణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల్ని గుర్తుచేశాయి కదా. దాని గురించి చెప్తారా?
బాలకృష్ణ: అవును నిజమే. ఇలాంటి వాటి గురించి ప్రజాప్రతినిధిగా వేరే వేదికలపై చర్చిస్తూనే ఉంటాం. సినిమా ఓ మాధ్యమం కాబట్టి దీని ద్వారా చెప్పాలనుకున్నాం. ఎందుకంటే ఇతరులు ఎవరైనా దాని గురించి మాట్లాడితే పట్టుంచుకోరు. మనం రాజధానిలేని రాష్ట్రంలో ఉంటున్నాం. దాని కోసం ఎంతోమంది పోరాటం చేస్తున్నారు. ఆ పరిస్థితులకు తగ్గట్టే కొన్ని డైలాగ్స్ చెప్పి ప్రజల్లో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేశాం.
* ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు బద్దలుకొట్టడమే కాదు ఓ థియేటర్లలో మంటలు పుట్టించింది. దానిపై మీ స్పందన?
బాలకృష్ణ: నేనెప్పుడూ విజయానికి పొంగిపోను. అపజయానికి కృంగిపోను. నా ప్రయత్నం నేను చేస్తా. జయాపజయాలు అన్నీ దైవాధీనం.
* ‘అఖండ’.. మీ కెరీర్కి ఎలా ఊతమైంది? ఎందుకని ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడటం లేదు?
బోయపాటి శ్రీను: బాలయ్య అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులూ క్యూ కట్టి చూసిన సినిమా ఇది. ఈ చిత్రంతో కొంతమందికే తెలిసిన నేను ఇప్పుడు ప్రతి ఇంటికీ పరిచయమయ్యా. ఆ అభిమానాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటా. ఇదనే (అఖండ) కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘పుష్ప’ అయినా, ‘శ్యామ్ సింగరాయ్’ అయినా, మరొకటైనా సినిమా గెలవటమే ముఖ్యం. కలెక్షన్ల గురించి ఆలోచించామంటే మా అంత అవివేకి ఎవరూ ఉండరు. ఈ రోజు సినిమా గెలిచింది అదే ఆనందం.
* ఈ సినిమాని అఘోరాలు కూడా చూశారు. అది విన్నాక మీకెలా అనిపించింది?
బాలకృష్ణ: అఘోరాలంటే మనలో చాలామందికి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. వాళ్లూ మనుషులే. ఆ విషయాన్నే ఈ సినిమాలో చూపించాం. అయితే వాళ్లకు వాళ్లు కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. అఘోరాలకు సరైన నిర్వచనమిచ్చిన చిత్రమిది. అలాంటి వారే ఈ సినిమాను చూడటం ఆనందాన్నిచ్చింది.
* విలన్గా ప్రేక్షకుల్ని భయపెట్టారు. మీ లుక్ చూసి ఊహ అలానే భయపడ్డారా?
శ్రీకాంత్: గెటప్తోనే ఓ రోజు ఇంటికి వెళ్లా. కుటుంబ సభ్యులంతా నన్ను గుర్తుపట్టలేదు పైగా భయపడ్డారు. ఈ పాత్రను చూసి భయపడి వేరేవాళ్లు అవకాశం ఇవ్వరేమోనని నాకు భయమేస్తోంది (నవ్వులు).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?