Gudipudi Srihari: గుడిపూడి శ్రీహరి విమర్శలతో నా నటనలో మార్పొచ్చింది: చిరంజీవి
సీనియర్ పాత్రికేయుడు, సినీ విమర్శకుడు గుడిపూడి శ్రీహరి మృతిపై ప్రముఖ నటుడు చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు అని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సినీ విమర్శకుడు గుడిపూడి శ్రీహరి (Gudipudi Srihari) మృతిపై ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు అని అన్నారు. ‘‘నేను నటించిన ఎన్నో చిత్రాలపై గుడిపూడి శ్రీహరి రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు, నటుడిగా నన్ను నేను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకునేందుకు దోహదపడ్డాయి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా శ్రీహరి కుటుంబానికి చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలిపారు.
మరోవైపు, గుడిపూడి శ్రీహరి గురించి చిరంజీవి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన వీడియో నెట్టింట దర్శనమిచ్చింది. సంబంధిత వీడియోను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ శ్రీహరికి నివాళి అర్పిస్తున్నారు. ‘‘నా నట జీవితాన్ని సరైన మార్గంలో పెట్టిన వారిలో గుడిపూడి శ్రీహరి, పీఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, నందగోపాల్ తదితర పాత్రికేయులున్నారు. నా సినిమా సెట్లో వారితో చర్చించి, ఎన్నో విషయాలు నేర్చుకునేవాడ్ని. ఆరోగ్యకర జర్నలిజం అంటే ఏంటో వారి దగ్గర తెలుసుకున్నా. ఒకప్పుడు ‘సితార’లో గుడిపూడి శ్రీహరి సినిమా రివ్యూలు రాస్తుండేవారు. ఆయన పదజాలం మనసుని బాధపెట్టినా ఓ ఉపాధ్యాయుడు విద్యార్థికి చెప్పినట్టుగా ఉండేది. నేను బాగా నటిస్తున్నానని, పోరాటాలు, డ్యాన్సులు.. ఇలా అన్నింటిలోనూ వేగం పెంచానని కితాబు ఇస్తూనే సంభాషణలు చాలా వేగంగా చెబుతున్నానని విమర్శించారు. ‘నటనలో స్పీడ్ ఉండాలిగానీ మాటలో కాదు’ అని ఆయన ఇచ్చిన సమీక్ష నాలో మార్పు తీసుకొచ్చింది’’ అని చిరంజీవి పంచుకున్న జ్ఞాపకాలు ఆ వీడియోలో వినిపిస్తాయి. సినీ రంగంలో పాత్రికేయుడిగా, విశ్లేషకుడిగా 55 ఏళ్లపాటు సేవలందించిన గుడిపూడి శ్రీహరి (88) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
గుడిపూడి శ్రీహరి ప్రస్థానమిదీ..
సినిమా సమీక్షలకు శ్రీకారం చుట్టిన తొలి వ్యక్తిగా గుడిపూడి శ్రీహరి నిలిచారు. ‘ఈనాడు’ దినపత్రికకు ‘హరివిల్లు’ పేరుతో వర్తమాన, రాజకీయ వ్యవహారాలపై దాదాపు 25 ఏళ్లపాటు వ్యంగ్య రచనలు చేశారు. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ అనే పుస్తకాన్ని రచించారు. జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థలో సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీహరి పనిచేశారు. 2013లో తెలుగు విశ్వవిద్యాలయం ఆయన్ను కీర్తి పురస్కారంతో సత్కరించింది. గుడిపూడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం గుడిపూడి శ్రీహరి మృతదేహం నిమ్స్ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంది. న్యూజిలాండ్లో ఉన్న కుమారుడు వచ్చిన తర్వాత శనివారం లేదా ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని శ్రీహరి కుటుంబసభ్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం