Chiranjeevi: దోశెలు వేసిన చిరంజీవి.. ఆయన బాటలోనే వరుణ్‌తేజ్‌

ప్రముఖ నటుడు చిరంజీవి పండగ వేళ గరిటె తిప్పారు. తానే స్వయంగా దోసెలు వేసి కుటుంబ సభ్యులకు పంచారు.

Updated : 17 Jan 2022 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు చిరంజీవి పండగ వేళ గరిటె తిప్పారు. తానే స్వయంగా దోశెలు వేసి కుటుంబ సభ్యులకు పంచారు. భోగి పండగను పురస్కరించుకుని చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబ సభ్యులు ఒక్క చోట చేరారు. ఉదయాన్నే భోగి మంటలు వేశారు. అనంతరం వరుణ్‌తేజ్‌తో కలిసి చిరంజీవి దోశెలు వేసే కార్యక్రమం ప్రారంభించారు. ఒకరితో ఒకరు పోటీ పడి 100కుపైగానే వేశారు. సంబంధిత వీడియోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.‘ ‘‘ఇవి ప్రేమతో చేస్తున్నవి. నా దోశె సరిగా రాలేదు. వరుణ్‌ దోశపై నాకు కుళ్లు వచ్చేసింది’’ అని వీడియోలో చిరంజీవి చెప్పిన సంగతులు అలరిస్తున్నాయి. వారంతా భోగి పండగను ఎలా జరుపుకొన్నారో వరుణ్‌తేజ్‌ సోదరి నిహారిక మరో వీడియో ద్వారా చూపించారు. కుటుంబ సభ్యులంతా ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపిన వీడియోను చిరంజీవి పోస్ట్‌ చేశారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు