Jagapathi Babu: జగపతిబాబు కీలక నిర్ణయం.. అవయవదానంపై ప్రతిజ్ఞ
ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతి బాబు మరణానంతరం అవయవ దానం చేయనున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. శనివారం ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సభాముఖంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్: అవయవదానంపై అవగాహన పెంచేందుకు టాలీవుడ్ నటుడు జగపతిబాబు ముందుకొచ్చారు. తన జన్మదినం సందర్భంగా మరణానంతరం తాను అవయవదానం చేయనున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. శనివారం ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సభాముఖంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
జన్మదినం సందర్భంగా ఏదైనా పది మందికీ ఉపయోగపడే కార్యక్రమం చేయాలనుకున్నానని, అవయవదానం ప్రతిజ్ఞ అయితే మరింత మందికి స్ఫూర్తి కలిగిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని జగపతి బాబు అన్నారు. గుండె, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, కాలేయం, కళ్లు, చర్మం, చేతులు.. ఇలా ఎన్నో రకాల అవయవాలను మరణానంతరం వేరేవారికి అమరిస్తే వాళ్లకు కొత్త జీవితం లభిస్తుందని ఆయన అన్నారు. తన అభిమానులంతా అవయవదానం చేయడానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు.
తమకు అయినవాళ్ల ప్రాణాలు పోతున్నాయని తెలిసీ, అదే సమయంలో బాధను దిగమింగుకుని మరికొందరి ప్రాణాలు నిలబెట్టేందుకు ముందుకు రావడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని కిమ్స్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. కొవిడ్ సమయంలో ఆసుపత్రిలో చేరిన ఎంతో మంది పేద సినీ కార్మికులకు ఆసుపత్రి బిల్లులు జగపతి బాబు చెల్లించారన్నారు. తన అభిమాన నటుడు జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో సాహసోపేతమని, ఆయన స్ఫూర్తితో మరింతమంది ముందుకు రావాలని కోరారు.
కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, వాణిజ్యం, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీవన్దాన్ ఇన్ఛార్జి, నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత, అవయవమార్పిడి నిపుణులైన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో అవయవదానం చేసిన పలువురు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
మోహన్లాల్ డ్యాన్స్ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్పై మోహన్లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.