Naresh- Pavitra: పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు? పవిత్రతో పెళ్లివీడియోపై నరేశ్ స్పందన!
Naresh- Pavitra: ఉదయం నుంచి సోషల్మీడియాలో ట్రెండ్ అవుతున్నపెళ్లివీడియోపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, అన్ని విషయాలు పంచుకుంటానని తెలిపారు.
హైదరాబాద్: సీనియర్ నటుడు నరేశ్ (Naresh).. తన స్నేహితురాలు పవిత్రా లోకేశ్ (pavitra lokesh)ను వివాహం చేసుకుంటున్న వీడియో ఉదయం నుంచి సోషల్మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. నరేశ్ స్వయంగా ట్విటర్ వేదికగా ఈ వీడియోను పంచుకుంటూ ‘ఒక పవిత్రబంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రానరేశ్’’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది.
ఈ క్రమంలో తాజా పెళ్లి వీడియోపై నరేశ్ స్పందించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఇంటింటి రామాయణం’ (Intinti Ramayanam) ప్రెస్మీట్లో మాట్లాడారు. ‘మీ పెళ్లి ఎప్పుడు? పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు’ అని ఒక విలేకరి ప్రశ్నించగా, నరేశ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. తనకూ రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఉన్నాయి. నేను మీడియాకు ఫ్రెండ్లీ వ్యక్తిని. త్వరలో ఈ అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తా. అప్పటి దాకా ఓపిక పట్టండి. ఇప్పుడు ఈ విషయంపై మాట్లాడితే ‘ఇంటింటి రామాయణం’ ప్రమోషన్ పక్కదోవ పడుతుంది. ఈ చిత్ర స్క్రిప్ట్ అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడంలో దర్శకుడు మారుతి, నిర్మాత వంశీ ముందుంటారు. ఇది పెద్ద సినిమా అవుతుంది. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ప్రతి ఇల్లు, కుటుంబ సభ్యలందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే నాకు బాగా నచ్చింది. తెలంగాణ యాసలో తొలిసారి మాట్లాడా. నేను బాగా ఎంజాయ్ చేసి నటించిన అతి తక్కువ చిత్రాల్లో ఇదీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని పంచుతుంది ’’అని నరేశ్ అన్నారు.
‘సమ్మోహనం’ చిత్రం కోసం కలిసి పనిచేసిన నరేశ్ (Naresh) - పవిత్ర (Pavitra) ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో సందడి చేశారు. ఈక్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ గతేడాది డిసెంబర్ 31న నరేశ్ షేర్ చేసిన వీడియో ఆయా వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. అందులో ఆయన పవిత్రను ముద్దాడుతూ కనిపించారు. ఇక ‘ఇంటింటి రామాయాణం’ చిత్రం విషయానికొస్తే, దర్శకుడు మారుతీ సమర్పణలో సురేశ్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ఇది.రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో నవ్య స్వామి, గంగవ్వ, నరేష్, సురభి తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?