కామెడీ పాత్రల్లోనే నటించాలని లేదు: ప్రియదర్శి
తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చిత్రంలో ‘నా చావు నేను ఛస్తా..నీకెందుకు’ అనే డైలాగ్తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక మంచి హాస్యనటుడిగా ప్రియదర్శి పులికొండ స్థిరపడిపోయారు. అటు పెద్ద చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు విలక్షణ
హైదరాబాద్: తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు చిత్రంలో ‘నా చావు నేను చస్తా..నీకెందుకు’ అనే డైలాగ్తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక మంచి హాస్యనటుడిగా ప్రియదర్శి పులికొండ స్థిరపడిపోయారు. అటు పెద్ద చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు విలక్షణ కథా నేపథ్యమున్న చిత్రాల్లో, వెబ్సిరీస్లలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా నవీన్ పొలిశెట్టితో కలిసి ‘జాతి రత్నాలు’ చిత్రంలో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. కాగా ‘జాతి రత్నాలు’ తెరవెనుక జరిగిన సరదా విషయాలతో పాటు తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆయన మనతో ముచ్చటించారు. అవేంటో చదివేయండి!
* ఈ ‘జాతి రత్నాలు’ కథను మొదట రాహుల్ నాకు చెప్పాడు. తనూ బాగా ఎంజాయ్ చేశానన్నాడు. నేను కూడా ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో భాగమైతే బాగుండనిపించింది. వెంటనే మా మేనేజర్ సీతారామ్తో ప్రయత్నాలు చేయించాను. ఎట్టకేలకు అనుదీప్ నాకు కథ వినిపించాడు. అంతలా నవ్వించే కథ చెప్తుతున్నాడంటే ఎంత ఫన్నీగా ఉంటాడో అనుకున్నా. కానీ అనుదీప్ సైలెంట్గా వచ్చి నాది ఫలనా పాత్ర అంటూ వివరించాడు. కథ విన్నప్పుడే పడిపడి నవ్వుకున్నాను.
* ఈ సినిమాలో ఉండే జోక్స్గానీ, పంచ్లుగానీ సాధారణంగా ఫ్రెండ్స్ గ్యాంగ్స్ మధ్య జరుగుతుండేవే. వీటికి కూడా జనాలు నవ్వుతారా అని మొదట్లో భయం ఉండేది. షూటింగ్ వెళ్లే ముందే కొంత వర్క్షాప్ కూడా చేశాం. అలా పూర్తి సన్నద్ధతతో షూట్కి వెళ్లాం. చిత్రం పూర్తయ్యాక చూసుకుంటే మేమే నవ్వాపుకోలేకపోయాం. ముఖ్యంగా మా ముగ్గురి మధ్య మంచి టైమింగ్తో సన్నివేశాలు పండాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రేక్షకులు పడుతున్న బ్రహ్మరథం చూస్తూంటే నమ్మలేకపోతున్నా..
* ఇందులోని ప్రతీ నటుడు ఎంతో అద్భుతంగా చేశారు. హీరోయిన్ ఫరీదాకు మొదటి చిత్రమే అయినా ఆ తేడా స్క్రీన్పై కనిపించలేదు. రాహులైనా, నేనైనా మా గత చిత్రాల్లో చేసిన హాస్యంతో పోల్చుకుంటే ఇది కొంచెం కొత్త తరహాలో ఉంటుంది. నా గత చిత్రం ‘మెయిల్’లో కూడా గంభీరంగా ఉంటూనే కామెడీ చేస్తా. నాకోసం ఇలాంటి పాత్రలు రాస్తున్న రచయితలకు ఎంతో రుణపడి ఉంటాను. నాగ్ అశ్విన్కు తానో పెద్ద డైరెక్టర్ననే గర్వం కించిత్ కూడా ఉండదు.
* ఇండ్రస్ట్రీలోని ప్రముఖ నటులంతా మా ‘జాతి రత్నాలు’కు కితాబిస్తూ ట్వీట్లు పెడుతుండటం సంతోషాన్నిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్గారు మొదటి నుంచి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ప్రభాస్గారు మా ట్రైలర్ను విడుదల చేయటం సినిమాపై ఎక్కువ ప్రభావం చూపింది. జనాల్లోకి బాగా వెళ్లింది. ఇదంతా చూస్తున్నప్పుడు చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. చిరంజీవిగారు మెచ్చుకోవడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన.
* నా తదుపరి చిత్రం శర్వానంద్గారితో కలిసి చేస్తున్నా. తెలుగు, తమిళంలో ఒకేసారి నిర్మితమవుతున్న సినిమా అది. తెలుగు వెర్షన్లో నేను, వెన్నెల కిషోర్గారు నటిస్తున్నాం. 2019లోనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాం. అలాగే ‘ఆహా’లో ఒక వెబ్ సిరీస్లో నటిస్తున్నా.
* మా ఫ్లాట్లో చాలామంది పెద్దవాళ్లు ఈ చిత్రాన్ని చూసి నన్ను అభినందించారు. ముఖ్యంగా సినిమాలో అసభ్యత ఎక్కడా కనిపించలేదు. అలనాటి హాస్యబ్రహ్మ జంధ్యాలగారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ క్లీన్ కామెడీ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించాం.
* ఒక మంచి నటుడిగానే ఇండస్ట్రీలో ఉండాలనుకున్నాను. ఎందుకంటే నాపై చిన్నప్పటి నుంచి ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావు, ప్రకాష్రాజ్గార్ల ప్రభావం బాగా ఉండేది. అలాగే కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో విలన్గా నటించా. తర్వాత తరుణ్భాస్కర్ తీసిన ‘పెళ్లిచూపులు’తో నా కెరీర్లో ఒక కీలక మలుపు వచ్చింది.
*నాకు పొలిటికల్ డ్రామాలో నడిచే చిత్రాలంటే చాలా ఇష్టం. తెలుగులో అవి చాలా తక్కువగా వస్తుంటాయి. నటుడిగా అన్ని తరహా చిత్రాల్లో నటించాలని ఉంది. కమెడియన్గానే మిగిలిపోకూడదనిపిస్తుంది. డైరెక్షన్ చేయాలని ఉంటుంది కానీ ప్రస్తుతమైతే ఆ ఉద్దేశం లేదు. ‘మెయిల్’ సీక్వెల్ కూడా చేసే ఉద్దేశంలో ఉన్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ