Actor Siddarth: టికెట్‌ ధరలపై మంత్రులకు నటుడు సిద్ధార్థ్‌ కౌంటర్‌

ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు రోజురోజుకి హాట్‌ టాపిక్‌గా మారుతోంది.

Published : 25 Dec 2021 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం రోజురోజుకి హాట్‌ టాపిక్‌గా మారుతోంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌‘ మీడియా సమావేశంలో నటుడు నాని ఏపీలో సినిమా టికెట్‌ ధరల తగ్గింపుపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉంది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్‌ ఎక్కువగా ఉన్నాయి.  టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. టికెట్ల ధరలు తగ్గించడంపై నటుడు సిద్ధార్థ్‌ మంత్రులపై సెటైర్లు వేశాడు. ‘‘సినిమా ఖర్చు తగ్గించి, కస్టమర్స్‌కు డిస్కౌంట్‌ అందిస్తున్నామంటున్నారు మంత్రులు. మరి మేము ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. వాటిని కొంత మంది విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. ఇంకొందరు అవినీతి రూపంలో రూ.లక్షల కోట్లు కాజేస్తున్నారు. మీ విలాసాలు తగ్గించుకొని మాకు డిస్కౌంట్స్‌ ఇవ్వండి’’ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌లో సిద్ధార్థ్‌ ఎవరి గురించి అంటున్నది చెప్పలేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో మాత్రమే టికెట్‌ రేట్ల సమస్య నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌  మాటలు ఏపీ మంత్రులను ఉద్దేశించి చేసినవే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని