Tarun: SSMB 28.. ఆ వార్తల్లో నిజం లేదు: తరుణ్‌

తన గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో సర్క్యూలేట్‌ అవుతోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటుడు తరుణ్‌ (Tarun) తెలిపారు. మహేశ్‌బాబు...

Published : 01 Sep 2022 02:26 IST

హైదరాబాద్‌: తన గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నటుడు తరుణ్‌ (Tarun) తెలిపారు. మహేశ్‌బాబు సినిమాతో తరుణ్‌ రీఎంట్రీ ఇవ్వనున్నారంటూ జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. మహేశ్‌ సినిమాలో తాను నటించడం లేదని.. సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తన జీవితంలో ఏం జరిగినా తానే స్వయంగా అభిమానులతో పంచుకుంటానని తెలిపారు.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా సిద్ధమవుతోంది. SSMB 28 గా ఇది ప్రచారంలో ఉంది. పూజాహెగ్డే కథానాయిక. త్వరలోనే ఈ సినిమా షూట్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్ర కోసం చిత్రబృందం తరుణ్‌ని సంప్రదించిందని, రోల్‌ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చేశారని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. తరుణ్‌ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో ఆ ప్రచారాలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని