vikram: ‘విక్రమ్‌’ వస్తున్నాడు..రిస్క్‌ వద్దంటున్న ఫ్యాన్స్!

ప్రముఖ కథానాయకుడు ‘చియాన్‌’ విక్రమ్‌(Chiyaan Vikram) ఇటీవల అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Published : 11 Jul 2022 16:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు ‘చియాన్‌’ విక్రమ్‌(Chiyaan Vikram) ఇటీవల అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఛాతిలో నొప్పి రావటంతో తన తండ్రి ఆస్పత్రిలో చేరారని, గుండెపోటు అంటూ వచ్చిన వార్తలు బాధపెట్టాయని, విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ విచారం వ్యక్తం చేశారు. కాగా, విక్రమ్‌ పూర్తిగా కోలుకున్నారని, సోమవారం(నేడు) చెన్నైలోని ఫోనిక్‌ మార్కెట్‌ సిటీలో జరగనున్న ‘కోబ్రా’(Cobra) ఆడియో, టీజర్‌ విడుదల వేడుకకు ఆయన హాజరుకానున్నారని కోబ్రా సినిమా దర్శకుడు అజయ్‌ జ్ఞాన్‌ముత్తు(R Ajay Gnanamuthu) ట్వీట్‌ చేశారు.

ఏఆర్‌ రెహమాన్‌(AR Rahman) మ్యూజిక్‌ అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకకు విక్రమ్‌ కూడా హాజరవుతుండటంతో ఘనంగా నిర్వహించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విక్రమ్‌ రాకతో కొందరు అభిమానులు సంతోషిస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన విశ్రాంతి తీసుకోవాలని కోరుతున్నారు. పూర్తిగా కోలుకున్నాకే రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆగస్టు 11న విడుదలకానున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కోబ్రా’లో విక్రమ్‌ దాదాపు 20వేషాల్లో దర్శనమివనున్నాడు. మాజీ టీమిండియా ప్లేయర్‌, ప్రముఖ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్(Irfan Pathan) ‘కోబ్రా’లో కీలకపాత్రలో నటించడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు