Chandrababu: చంద్రబాబు, లోకేశ్‌ త్వరగా కోలుకోవాలి: చిరంజీవి, ఎన్టీఆర్‌

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రముఖ నటులు చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు.

Updated : 25 Nov 2022 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రముఖ నటులు చిరంజీవి, ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు వేర్వేరుగా ట్వీట్‌ చేశారు. ‘‘చంద్రబాబుగారు, లోకేశ్‌ కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

‘‘మామయ్య చంద్రబాబు, లోకేశ్‌ త్వరగా కోలుకోవాలి’’ అని ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు. తనకు కొవిడ్‌ స్వల్ప లక్షణాలు ఉన్నట్టు చంద్రబాబు ట్విటర్‌ ఖాతా ద్వారా మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం.. ఆయన ఉండవల్లిలోని నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు, లోకేశ్‌కు సోమవారమే కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ ఇద్దరూ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగిరావాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు నెటిజన్లూ ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని