Ravi Teja: రవితేజకు జోడీగా బాలీవుడ్‌ నటి... ఆ క్రేజీ ప్రాజెక్టు ఏదంటే?

రవితేజ ప్రధాన పాత్రలో ‘దొంగాట’ ఫేం వంశీ తెరకెక్కిస్తున్న బయోపిక్‌ చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’.

Updated : 31 Mar 2022 21:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ ప్రధాన పాత్రలో ‘దొంగాట’ ఫేం వంశీ తెరకెక్కిస్తున్న బయోపిక్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురం గజదొంగ జీవితాధారంగా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్‌ నటి, కృతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్ ఎంపికైంది. ఆమెను ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానిస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘ఫిల్హాల్‌’ అనే వీడియో సాంగ్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నుపుర్‌ ‘నూరని చెహ్రా’ అనే చిత్రంతో తెరంగ్రేటం చేయనుంది. ఈ సినిమా విడుదలవకముందే ‘టైగర్‌..’లో అవకాశం అందుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

1970ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 2న ప్రారంభంకానుంది. అదే రోజు ప్రీ లుక్‌ విడుదలవుతుంది. ఇప్పటికే టైటిల్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, ఛాయాగ్రహణం: మధి, మాటలు: శ్రీకాంత్‌ విస్సా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని