Meera Jasmine: టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న మలయాళీ హీరోయిన్‌

తన పాత్ర డబ్బింగ్‌కు సంబంధించిన ఫొటోను షేర్‌ చేస్తూ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపారు మలయాళీ నటి. 

Published : 01 Feb 2023 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భద్ర’, ‘గుడుంబా శంకర్‌’, ‘గోరింటాకు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటి మీరా జాస్మిన్‌ (Meera Jasmine). టాలీవుడ్‌కు పదేళ్లు దూరంగా ఉన్న ఆమె త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మీరా జాస్మిన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తన పాత్ర డబ్బింగ్‌కు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. సినిమా వివరాలను ప్రకటించలేదు. ఆమె ఏ చిత్రంలో నటిస్తున్నారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ‘అమ్మాయి బాగుంది’తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైన మీరా.. పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ, రవితేజవంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. ఆమె చివరిగా నటించిన తెలుగు సినిమా ‘మోక్ష’. 2013లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె మలయాళం సినిమాలతో బిజీ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు