ఓటీటీలో ‘క్వశ్చన్‌ మార్క్‌’ 

అదా శర్మ నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘క్వశ్చన్‌ మార్క్‌’(?). విప్రా దర్శకుడు. గౌరీ కృష్ణ నిర్మాత. రఘు కుంచె

Updated : 19 Dec 2020 17:09 IST

హైదరాబాద్‌: అదా శర్మ నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘క్వశ్చన్‌ మార్క్‌’(?). విప్రా దర్శకుడు. గౌరీ కృష్ణ నిర్మాత. రఘు కుంచె స్వరాలందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘మా చిత్రం నుంచి వచ్చిన పోస్టర్, పాటలకు మంచి ఆదరణ దక్కింది. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మా చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. త్వరలోనే ఓ మంచి విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: ఉద్ధవ్, ఛాయాగ్రహణం: వంశీ ప్రకాష్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని