Adavi Seshu: నా కెరీర్‌లో ఇవి ఉద్విగ్న క్షణాలు: అడవి శేష్‌

అడవి శేషు హీరోగా నటిస్తున్న చిత్రం మేజర్‌. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు దర్శకుడు శశికిరణ్‌ తిక్కా.

Published : 28 May 2022 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అడవి శేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం మేజర్‌. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు దర్శకుడు శశికిరణ్‌ తిక్కా. ప్రతి భారతీయడిని భావోద్వేగానికి గురిచేసేలా తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దేశంలోని 9 నగరాల్లో ఈ చిత్రాన్ని విడుదలకు ముందే ప్రదర్శిస్తామని చిత్రబృందం తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జైపుర్‌లోని ఓ థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. సినిమాలోని సన్నివేశాలకు ప్రేక్షకులు భావోద్వేగానికి గురై సందీప్‌ ఉన్నికృష్ణన్‌ అమర్‌రహే.. అంటూ నినాదాలు చేశారు.

ఈ మొత్తం దృశ్యాల వీడియోను అడవి శేష్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘ఇలా జరగడం మొదటిసారి చూస్తున్నాను. సినిమాలోని సన్నివేశంలో అమర్‌ రహే సందీప్‌ అంటుంటే.. సినిమా చూసే ప్రేక్షకులు కూడా భావోద్వేగంతో లేచి నినాదాలు చేస్తున్నారు. ఇవి నా కెరీర్‌లో ఉద్విగ్న క్షణాలు...’ అంటూ చెప్పుకొచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని