Adipurush: మలి భాగం ఉంటుందా?

రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రను పోషించగా.. జానకిగా కృతిసనన్‌ నటించింది. లంకేశ్వరుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు.

Published : 27 Mar 2022 12:28 IST

రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రను పోషించగా.. జానకిగా కృతిసనన్‌ నటించింది. లంకేశ్వరుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. దీన్ని వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా మరో చిత్రం తీసుకొచ్చేందుకు ఓం రౌత్‌ ప్రణాళిక రచిస్తున్నట్లు ప్రచారం  వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఆలోచన ప్రభాస్‌తో పంచుకోగా.. ఆయన సానుకూలంగా స్పందించారని టాక్‌. అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే ఏడాదే ఈ సీక్వెల్‌ను పట్టాలెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’తో పాటు ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాల్లో నటిస్తున్నారు. సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ అనే చిత్రాన్ని ప్రకటించారు. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని