Adipurush: ఇక ఏడాదికి రెండు సినిమాలు.. పెళ్లిపైనా స్పందించిన ప్రభాస్!
ప్రభాస్ (Prabhas), కృతిసనన్, సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ చిత్రం.. ‘ఆదిపురుష్’. ఈ నెల 16న విడుదలకానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ఓం రౌత్ (Om raut) దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ డ్రామా చిత్రం.. ‘ఆది పురుష్’ (Adipurush). కృతిసనన్ (Kriti Sanon), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీరిలీజ్ (Adipurush Pre Release Event) ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వేడుకనుద్దేశించి ప్రభాస్ మాట్లాడుతూ.. ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని, కుదిరితే మూడు సినిమాలు వచ్చేలా చూస్తానని అన్నారు. అలాగే తన పెళ్లిపైనా ప్రభాస్ స్పందించారు. ఆయన మాట్లాడుతుండగా, ‘పెళ్లెప్పుడు’ అని అభిమానులు అడగ్గా, ‘ఇక్కడే తిరుపతిలోనే ఎప్పుడైనా చేసుకుంటా’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘ఏడు నెలల క్రితం 3డీలో ట్రైలర్ విడుదల చేసినప్పుడు మీరిచ్చిన ధైర్యంతోనే టీమ్ మరింత కష్టపడి పనిచేసింది. మీ ప్రోత్సాహంతోనే ఒక యుద్ధంలా చిత్ర బృందం కష్టపడింది. రోజుకు రెండు మూడు గంటలే నిద్రపోయిన సందర్భాలూ ఉన్నాయి. ‘ఆదిపురుష్’లాంటి సినిమా చేయడం నా అదృష్టం. ఒక సందర్భంలో చిరంజీవిగారిని కలిసినప్పుడు ‘ఏంటి రామాయణం చేస్తున్నావా’ అని అడిగారు. ‘అవునండీ’ అని చెప్పా. ‘అందరికీ ఇలాంటి అదృష్టం దొరకదు. నీకు దక్కింది’ అని అభినందించారు. రామాయణం చేయాలంటే కష్టపడాల్సి వస్తుందని అంటారు. అలాంటి కష్టాలు మాకూ ఎదురయ్యాయి. నా 20ఏళ్ల కెరీర్లో ఓం రౌత్లాంటి వ్యక్తిని చూడలేదు. ఒక పోరాటంగా ఈ సినిమాను పూర్తి చేశారు’’
‘‘సినిమా ఫంక్షన్లకు హాజరుకాని చినజీయర్ స్వామివారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. నిర్మాత భూషణ్కుమార్ తన తండ్రి కోరిక మేరకు రామాయణం తీశారు. ఈ సినిమాను ఒక ఎమోషనల్గా తీసుకున్నారు. ఇందులో నాతో పాటు లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే చాలా బాగా నటించారు. ఇక కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేకుండా చేసింది. సీత పాత్రకు సంబంధించిన పోస్టర్లో ఆమె ఎక్స్ప్రెషన్ చూసి ఆశ్చర్యపోయా. ఈ సినిమా టెక్నికల్ టీమ్ అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చింది. ఎప్పటికీ ప్రేక్షకులు, అభిమానులే నా బలం. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే సినిమా పూర్తి చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చాం. మామూలుగా వేదికలపై నేను మాట్లాడే దానికంటే ఈసారి ఎక్కువ మాట్లాడా. ఇకపై అభిమానుల కోసం ఏడాదికి రెండు సినిమాలు చేస్తా. కుదిరితే మూడు కూడా రావచ్చు. వేదికలపై తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అని ప్రభాస్ అన్నారు.
ఇది ప్రతి భారతీయుడి సినిమా: ఓం రౌత్
‘ఆదిపురుష్’.. ప్రతి భారతీయుడి సినిమా అని దర్శకుడు ఓం రౌత్ తెలిపారు. ‘‘మీరంతా ఈ ఈవెంట్కు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ కోసమే ఈ రోజు ఫైనల్ ట్రైలర్ విడుదల చేశాం. చూసి ఆస్వాదించండి. నిర్మాత భూషణ్కుమార్ నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. నేను దర్శకుడిని మాత్రమే కాదు, భూషణ్కు మంచి స్నేహితుడిని. ఆయన తండ్రి కోరికను తెరపై తీసుకురావడంలో నాకు కూడా ఒక బాధ్యత ఉంది. ప్రభాస్ లేకుండా ఈ సినిమా లేదు. ‘ఆదిపురుష్’ ప్రభాస్తోనే సాధ్యమైంది. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. జూన్ 16న థియేటర్లో కలుసుకుందాం. రామనామం ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడని నమ్ముతారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ‘ఆది పురుష్’ ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఆ హనుమంతుడి కోసం ఒక సీట్ ఖాళీగా ఉంచాలని అందరినీ కోరుతున్నా’’ అని ఓం రౌత్ కోరారు.
ఇది నాకు స్పెషల్ మూవీ: కృతిసనన్
‘‘నేను నా కెరీర్ను తెలుగు ఇండస్ట్రీతోనే మొదలు పెట్టా. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ మీ ముందుకు వచ్చా. ‘ఆదిపురుష్’ నాకు స్పెషల్ మూవీ. మీ ప్రేమాభిమానాల వల్లే ఇంత త్వరగా ఈ సినిమాలో నటించే అదృష్టం దక్కింది. ఇతర సినిమాల్లా నేను ఇందులో నటించలేదు. ఎందుకంటే సీత పాత్ర చాలా పవర్ఫుల్. రాముడిపై జానకికి ఉన్న ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. అలాగే సినిమా షూటింగ్ సమయంలోనూ ప్రతి ఒక్కరూ ఎంతో స్వచ్ఛంగా పనిచేశారు. సాధారణంగా ప్రభాస్ ఎక్కువ మాట్లాడరని అనుకుంటారు. కానీ, ఆయన చాలా బాగా మాట్లాడతారు. మంచి వ్యక్తి. నా కుటుంబమే నాకు బలం’’ అని కృతి సనన్ చెప్పారు.
నిర్మాత భూషణ్కుమార్ మాట్లాడుతూ.. ‘‘రామాయణాన్ని సినిమాగా తీయాలన్నది మా నాన్నగారి కోరిక. ఓం రౌత్ కారణంగానే ఆ కోరికను నెరవేర్చగలిగాం. ఇది మాకు కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇదొక ఎమోషన్. మీరంతా సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి’’ అని ప్రేక్షకుల్ని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!