adivi sesh: చిరంజీవిని ఉద్దేశిస్తూ అడివి శేష్‌ ఎమోషనల్‌ పోస్ట్‌..

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్‌(Adivi Sesh) తాజాగా మేజర్‌ సినిమాకు గాను సంతోషం అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. 

Published : 08 Jan 2023 11:17 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకుని వరస విజయాలతో జోరుమీద ఉన్నాడు యంగ్‌ హీరో అడివి శేష్‌(Adivi Sesh). తాజాగా ‘హిట్‌2’ తో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ‘మేజర్‌’ సినిమాకు గాను సంతోషం అవార్డు అందుకున్న ఈ హీరో తన ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా వ్యక్తం చేశాడు. చిరంజీవి(Chiranjeevi) చేతుల మీదగా అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసిన అడివి శేష్‌ చిరంజీవిని ఉద్దేశిస్తూ పోస్ట్‌ పెట్టారు.

‘‘నా చిన్నతనంలో మీ సినిమా టికెట్ల కోసం కొట్టుకునే వాళ్లం. ఆ రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇక ‘మేజర్‌’ సినిమా కోసం ఒకరోజు మధ్యాహ్నం అంతా మీతో గడపడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఇప్పుడు మీ చేతుల మీదగా ఆ సినిమాకు వచ్చిన అవార్డును అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ మూమెంట్‌ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. థ్యాంక్యూ చిరంజీవి సర్‌’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు అడివి శేష్‌ను ప్రశంసిస్తున్నారు. ‘మేజర్‌’ అనేది సినిమా కాదు.. అది ఒక ఎమోషన్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

గతేడాది ‘మేజర్‌’ (Major), ‘హిట్‌2’ (HIT 2) రెండు సినిమాలతో బ్లాక్‌బాస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్‌ హీరో ఇటీవలే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. తన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ‘గూఢచారి’ (Goodachari) సినిమా సీక్వెల్‌ను త్వరలోనే పట్టాలెక్కిస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని