Enthavaarugaani: ఉత్కంఠను రేకెత్తించేలా ‘ఎంతవారు గాని’ టీజర్‌

విభిన్నమైన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఎంతవారుగాని..!’. తాజాగా ఈసినిమా టీజర్‌ను నటుడు అడివి శేష్‌ విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

Published : 07 Dec 2022 10:55 IST

హైదరాబాద్‌: సూర్య శ్రీనివాస్ (Surya Srinivas)‌, షెర్రీ అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో ఎన్‌.శ్రీనివాసన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఎంతవారుగాని’ (Enthavaarugaani). రాజశేఖర్‌ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో అడివి శేష్‌ (Adivi Sesh) విడుదల చేశారు. ఈ సందర్భంగా శేష్‌ మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ బాగుంది. యువతరాన్ని ఆకర్షించే ఓ ఆసక్తికర అంశం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వినూత్నమైన సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని