Major: అడివి శేష్‌ ‘మేజర్‌’: 120 రోజులు.. 8 సెట్స్‌.. 75 లొకేషన్స్‌..

అడివి శేష్‌ కథానాయకుడిగా శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మేజర్‌’. ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో

Published : 03 Nov 2021 11:31 IST

హైదరాబాద్‌: అడివి శేష్‌ కథానాయకుడిగా శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మేజర్‌’. ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌  జీవితాధారంగా రూపొందుతోంది. బుధవారం ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చిత్ర బృందం పంచుకుంది. ఫిబ్రవరి 11, 2022న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, స్పెషల్‌ మేకింగ్‌ వీడియోను షేర్‌చేసింది. 120 రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారట. 8సెట్స్‌ వేశారు. 75లొకేషన్‌లో షూటింగ్‌ జరిగింది. మూడు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సహకారంతో సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంస్థ ‘మేజర్’ను నిర్మిస్తోంది. శోభితా, సయీ మంజ్రేకర్‌ కథానాయికలు. ప్రకాశ్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందిస్తున్నారు. వంశి పచ్చిపులుసు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని