Adivi Sesh: ‘మేజర్‌’ వాయిదా

అడవి శేష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మేజర్‌’ సినిమా విడుదల వాయిదా పడింది. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌

Updated : 27 May 2021 06:04 IST

డవి శేష్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మేజర్‌’ సినిమా విడుదల వాయిదా పడింది. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. 26/11 ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఎన్‌.ఎస్‌.జి కమాండో మేజర్‌ సందీప్‌ ఉన్ని  కృష్ణన్‌గా అడవి శేష్‌ నటిస్తున్నారు. కథానాయికలు సయీ మంజ్రేకర్‌, శోభితా ధూళిపాళ్ల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శశికిరణ్‌ తిక్క  దర్శకుడు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తోంది. ‘‘కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి కారణంగా  పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అందుకే జూన్‌ 2న విడుదల చేస్తామని ఇదివరకు ప్రకటించిన ‘మేజర్‌’ సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించాం. కరోనా తగ్గిన తర్వాత  తదుపరి విడుదల ఎప్పుడనేది అధికారికంగా ప్రకటిస్తాం’’ అని సినీ వర్గాలు తెలిపాయి. ప్రకాష్‌రాజ్‌, రేవతి, మురళీశర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కూర్పు: ఎస్‌.వినయ్‌కుమార్‌, కె.పవన్‌కల్యాణ్‌, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు, సంభాషణలు: అబ్బూరి రవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని