Adivisesh: రిలేషన్స్లో ఉన్నా.. పెళ్లి వరకూ తీసుకెళ్లే ధైర్యం రాలేదు : అడివి శేష్
సినిమా ఇండస్ట్రీలో గాడ్ఫాదర్ అంటూ ఎవరూ లేకుండా నటుడు కావాలనే ఆసక్తితో అమెరికా నుంచి వచ్చి పరిశ్రమలోకి అడుగుపెట్టి స్వశక్తితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు అడివిశేష్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.....
ముద్దు సన్నివేశాలపై నటుడి అభిప్రాయమేంటంటే..?
హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో గాడ్ఫాదర్ లేకుండా నటుడు కావాలనే ఆసక్తితో అమెరికా నుంచి వచ్చి స్వశక్తితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు అడివిశేష్ (Adivisesh). ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో సహాయనటుడు, విలన్ పాత్రలు పోషించిన ఆయన ‘క్షణం’తో (Kshanam) హీరోగా మారారు. ఆ సినిమా సక్సెస్తో ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్లలో నటించి మెప్పించారు. ఇటీవల ఆయన నటించిన ‘మేజర్’(Major) బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా శేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
‘‘నేను అమెరికాలోనే పెరిగినప్పటికీ చిన్నతనం నుంచి భారతదేశమంటే గౌరవం. దేశానికి సంబంధించి ఏ మాట విన్నా నాలో తెలియని అనుభూతి. సినిమాల్లో చేయాలని నిర్ణయించుకుని పరిశ్రమలోకి అడుగుపెట్టి చిన్న చిన్న రోల్స్ చేస్తున్న సమయంలో టాలీవుడ్కు చెందిన ఓ స్టార్ హీరో తనయుడ్ని చూశా. అతను అప్పటికింకా సినిమాల్లోకి కూడా రాలేదు. బాలనటుడిగా ఓ సినిమా మాత్రమే చేశాడు. అతనికున్న క్రేజ్ చూసి.. తప్పకుండా నాకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఇప్పటివరకూ నేను విభిన్నమైన పాత్రలు పోషించాను. నేను చేసే సినిమాల్లో డ్యూయెట్లు ఉండవు. ఎందుకంటే, నా డ్యాన్స్పై నాకే సందేహం. భవిష్యత్తులో ఓ పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటించాలని ఉంది. ఇక, ‘గూఢచారి’లో(Goodachari) మాత్రమే ముద్దు సన్నివేశాల్లో నటించాను. నా దృష్టిలో ఏదైనా సీన్ని కథ డిమాండ్ చేస్తేనే పెట్టాలి తప్ప.. కలెక్షన్ల కోసం మనం క్రియేట్ చేయకూడదు’’
‘‘యూఎస్లో నివసిస్తున్న ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించాను. కొన్ని కారణాలతో మా రిలేషన్ బ్రేకప్ అయ్యింది. అది కూడా నా పుట్టినరోజు నాడే ఆమె పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఆ తర్వాత రిలేషన్స్లో ఉన్నాను కానీ.. పెళ్లి వరకూ తీసుకెళ్లే ధైర్యం రాలేదు. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం సినిమాలపైనే. ఇక, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్..? అని ఇంట్లోవాళ్లు అడిగి కాస్త విసిగిపోయారు. ప్రస్తుతం వాళ్లు మా చెల్లి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు’’ అని అడివిశేష్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది..
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి