Adivi Sesh: ‘మేజర్‌’ మన సినిమా.. టికెట్‌ ధరలివీ: అడివి శేష్‌

‘ఇది మన సినిమా. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సినిమా టికెట్‌ ధరలను నిర్ణయించాం’ అంటూ ‘మేజర్‌’ చిత్ర టికెట్‌ ధరల పట్టికను పోస్ట్‌ చేశారు నటుడు అడివి శేష్‌.

Published : 27 May 2022 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇది మన సినిమా. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సినిమా టికెట్‌ ధరలను నిర్ణయించాం’ అంటూ ‘మేజర్‌’ చిత్ర టికెట్‌ ధరల పట్టికను పోస్ట్‌ చేశారు నటుడు అడివి శేష్‌. ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వీరజవాను ఉన్ని సందీప్‌ కృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది. సందీప్‌ పాత్రలో శేష్‌ నటించాడు. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 3న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే శేష్‌ తెలుగు రాష్ట్రాల థియేటర్లకు సంబంధించిన టికెట్‌ రేట్లపై స్పందించారు. సింగిల్‌ స్క్రీన్స్‌: తెలంగాణ- రూ.150, ఏపీ- రూ.147; మల్టీప్లెక్స్‌: తెలంగాణ- రూ.195, ఏపీ- రూ.177 (జీఎస్టీతో కలిపి)గా ఉంటాయని శేష్‌ తెలిపారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడంతో ‘మేజర్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, శోభిత, సయీ మంజ్రేకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పలు నగరాల్లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించగా అంతటా మంచి టాక్‌ సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని