Unstoppable2: ఆ ఇద్దర్నీ షాపింగ్‌కు తీసుకెళ్తానంటున్న ప్రభాస్.. ఆసక్తిగా ‘అన్‌స్టాపబుల్‌2’ లేటెస్ట్ ప్రోమో

అన్‌స్టాపబుల్‌2(Unstoppable2) లో ప్రభాస్‌‌(Prabhas) ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో భాగం ప్రోమోను ఆహా విడుదల చేసింది. చూసింది కూసింతే.. చూడాల్సింది కొండంత అని ట్వీట్‌ చేసింది.

Updated : 01 Jan 2023 14:03 IST

హైదరాబాద్‌: అన్‌స్టాపబుల్‌2(Unstoppable2)లో ప్రభాస్‌ ఎపిసోడ్‌ మొదటి భాగం ఇటీవల ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.  ప్రభాస్‌ ఈ కార్యక్రమానికి వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్‌ ప్రోమోలు, అప్‌డేట్స్‌ కోసం ఎంతగానో ఎదురుచూశారు. అందుకే ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కాగానే రికార్డు స్థాయిలో వ్యూవ్స్‌ నమోదయ్యాయి. ఇక ప్రభాస్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో భాగం ప్రోమోను తాజాగా ఆహా విడుదల చేసింది. బాలకృష్ణ(Balakrishna) హుషారైన పంచులతో ప్రభాస్‌(Prabhas) సరదా సమాధానాలతో ఆకట్టుకుంటోంది ఈ ప్రోమో. ఈ రెండోభాగంలో ప్రభాస్‌తో పాటు గోపిచంద్‌(Gopichand) కూడా పాల్గొన్నాడు. తమన్నా, నయనతారలలో ఎవరినీ షాపింగ్‌కు తీసుకెళ్తావు అని ప్రభాస్‌ను అడగ్గా.. ‘ఇద్దర్నీ తీసుకెళ్తాను..’ అని సమాధానం చెప్పాడు. దీంతో బాలకృష్ణ ‘రెబల్‌స్టార్‌ నారీనారీ నడుమ మురారీ’ అంటూ స్టేజ్‌పై నవ్వులు పూయించారు. ఈ ఎపిసోడ్‌ జనవరి 6న డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. 

‘మీరు చూసింది కూసింత, చూడాల్సింది కొండంత ఉంది. సెంకండ్‌ హాఫ్‌లో రచ్చ మాములుగా ఉండదు రెడీగా ఉండండీ’ అంటూ ఆహా విడుదల చేసిన ఈ వీడియోపై మీమ్స్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. మొదటిభాగం చివరిలో చూపించిన వీడియోనే మళ్లీ విడుదల చేశారంటూ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. అలాగే పవన్‌కల్యాణ్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఎప్పుడు ఇస్తారంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని