Ahimsa: కోవెల శిథిలం అయినా దేవత కలుషితమవదే
తేజ - ఆర్పీ పట్నాయక్... పోస్టర్పై ఈ కలయిక కనిపిస్తే చాలు... సినిమా విజయం ఖాయమైనట్టే భావించేవాళ్లు ప్రేక్షకులు. గుర్తుండిపోయే పాటలు, విజయవంతమైన చిత్రాలకి కేరాఫ్ ఈ కలయిక. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ ఇద్దరూ జట్టు కట్టారు. దగ్గుబాటి అభిరామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ‘అహింస’ చిత్రం కోసం. గీతిక కథానాయిక.
తేజ - ఆర్పీ పట్నాయక్... పోస్టర్పై ఈ కలయిక కనిపిస్తే చాలు... సినిమా విజయం ఖాయమైనట్టే భావించేవాళ్లు ప్రేక్షకులు. గుర్తుండిపోయే పాటలు, విజయవంతమైన చిత్రాలకి కేరాఫ్ ఈ కలయిక. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ ఇద్దరూ జట్టు కట్టారు. దగ్గుబాటి అభిరామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ‘అహింస’ చిత్రం కోసం. గీతిక కథానాయిక. తేజ - ఆర్పీలకి ఈసారి సీనియర్ రచయిత చంద్రబోస్ తోడయ్యారు. దాంతో ఈ పాటలపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకి తగ్గట్టే ఇటీవల విడుదలైన తొలి గీతం ‘నువ్వే.. నువ్వే’ శ్రోతల్ని అలరిస్తోంది. ఈ పాట ప్రయాణం గురించి చంద్రబోస్ ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘దర్శకుడు తేజతోనూ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్తోనే ఎంత పనిచేసినా ఇంకా చేయాలనిపిస్తుంది. అలాంటి వాతావరణాన్ని వాళ్లు సృష్టిస్తుంటారు. ఇదివరకు తేజ దర్శకత్వం వహించిన పలు సినిమాలకి పాటలు రాశా. ఆర్పీ సంగీతంలోనూ రాశా. కానీ ఆ ఇద్దరితో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ఈ కలయికకి తోడు, మంచి బాణీ, మంచి సందర్భాలున్న కథ కావడంతో నాలో ప్రత్యేకమైన ఉత్సాహం ఉత్సుకత ఏర్పడింది. వాళ్లు ఒక సందర్భం, సన్నివేశం, ఇతర మౌళికమైన అంశాల్ని చెప్పి వదిలేస్తారు. అది ఏరకంగా ఇస్తామనేది మన ఇష్టమే. అలాంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు మరింత బాధ్యతగా పనిచేస్తాం. ఇద్దరి మధ్య ప్రేమ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని పల్లవిలో చెబుతూ... చరణంలోకి వెళ్లా. ప్రేయసీప్రియులు చెలిమి చేసిన తొలినాళ్లల్లో ఒక క్షణానికీ, ఒక అడుగుకీ ఎంత విలువ ఉంటుందో చెబుతూ
‘నీ జతగా అడుగే పడగా
ఆ క్షణమే కళ్యాణమే
నీ చెలిమే ముడులే పడగా
ఆ చనువే మాంగల్యమే’ అని రాశా.
స్నేహం సాప్తపదీనం అంటారు. పరిచయం లేని వ్యక్తితో ఏడడుగులు కలిసి నడిస్తే స్నేహం పుడుతుందట. ఇక అప్పటికే బంధంలో ఉన్న ఆ ఇద్దరూ ఒక అడుగు వేసినా అది కల్యాణంతో సమానమే అని... ముడుల్లాగా పెనవేసుకున్న చెలిమి, దాంతో ఇద్దరి మధ్య ఏర్పడిన చనువు మంగళసూత్రంతో సమానమని చెప్పే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. అంత మంచి భావం ఇందులో ఉంది. నిండు నూరేళ్లు కలిసి ఉంటాననే వాగ్ధానమే మంగళసూత్రం వెనక ఉంటుంది. మునివేళ్లతో నేను స్పృశిస్తుంటే ఆ స్పర్శే నేనెప్పుడూ విడిపోననే వాగ్ధానం, వేద మంత్రంతో సమానమంటూ ‘నును లేతగ మునివేళ్ళు మెడ ఒంపున చేసేను... ఎన్నడు విడిపోనని వాగ్ధానమే...’ అని రాశా.
కథలో ఆ సందర్భానికి తగ్గట్టుగా ‘నీ మనసే విరిసే కమలం.. నా మనసే బిగిసే కవచం... ఏ సమయం నిను వీడదే...’ అంటూ రాశా.
ఈ మొత్తం పాటకి ప్రాణం ‘కోవెల శిథిలం అయినా దేవత కలుషితమవదే... నమ్మవే నను నమ్మవే మా అమ్మవే’ అనే వాక్యం. ఇది బాణీలో రావడం, రాయడం అన్నది చాలా అందాన్నిచ్చింది. కోవెల కూలిపోయినా అందులో దేవత మహిమకి, పవిత్రతకీ భంగం కలగదు అని ఇక్కడ చెబుతున్నాం. సినిమాలో వచ్చే ఆ సందర్భానికి తగ్గ వాక్యం అది. హీరో చెప్పే ఆ వాక్యంతో కథానాయికకి సాంత్వన చేకూరుతుంది. ఈ పాట విడుదలైన మరుక్షణమే కీరవాణి గారి నుంచి సందేశం వచ్చింది. ‘ట్యూన్ శిథిలం కాలేదు, మాటలు కలుషితం అవ్వలేదు’ ఈ పాటలో అన్నారాయన. భాస్కరభట్ల, జె.కె.భారవి, మధుర శ్రీధర్, మిట్టపల్లి సురేందర్... ఇలా చాలామంది ఫోన్ చేసి అభినందించారు. మంచి సాహిత్యం, విలువైన కవిత్వం రాస్తే ఎప్పటికీ ఆదరణ ఉంటుందనే పాత విషయాన్నే ఈ పాటతో కొత్తగా తెలుసుకున్నా. సిద్ శ్రీరామ్ గొంతులో మాధుర్యంతోపాటు, ఆత్మీయత ఉంటుంది. అది హృదయాల్ని కదిలిస్తుంది. ఇక తనలోనే సంగీతం నింపుకున్న తెలుగు భాష అయినప్పుడు, ఆర్ధ్రతతో కూడిన పదాలు పడినప్పుడు ఆ భావానికి ఆ గాత్రంతో మరింత వన్నె వస్తుంది. నేను రాసిన నీలి నీలి ఆకాశం, ఒకే ఒక లోకం, శ్రీవల్లి, కుంకుమలా నువ్వే, ఇప్పుడు నీతోనే... పాటల్ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటని సత్యయామిని కూడా చాలా బాగా పాడారు. పూర్తిస్థాయిలో ప్రేమతోపాటు, ఆవేదన కూడా ఆ గొంతులో పలకాలి. అలాగే పలికించారు సత్యయామిని. మధ్య ప్రదేశ్లోని ఓ అడవి మధ్యలో కూర్చుని దర్శకుడు, ఛాయాగ్రాహకుడు ఒక పక్క లొకేషన్ల వేట కొనసాగిస్తుంటే, మరోపక్క నేను మూడు పాటలు రాశా. అందులో ఈ పాట ఒకటి’’.
చిత్రం: అహింస
రచన: చంద్రబోస్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
గానం: సిధ్శ్రీరామ్, సత్యయామిని
పల్లవి: కలలో అయినా
కలయికలో అయినా
కలిసుండని కాలాలైనా...
నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ...
ఎదుటే వున్నా
ఎదలోనే వున్నా
ఏ దూర తీరానున్నా...
నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ...
చరణం: 1
నీ జతగా అడుగే పడగా
ఆ క్షణమే కళ్యాణమే
నీ చెలిమే ముడులే పడగా
ఆ చనువే మాంగల్యమే
నును లేతగ మునివేళ్ళు
మెడ ఒంపున చేసేను
ఎన్నడు విడిపోనని వాగ్ధానమే...
నీతోనే నీతోనే నీతోనే నేనెపుడూ
నాతోనే నాతోనే నువ్వెపుడూ
చరణం: 2
నీ మనసే విరిసే కమలం
ఏ మలినం నిన్నంటదే
నా మనసే బిగిసే కవచం
ఏ సమయం నిను వీడదే
కోవెల శిథిలం అయినా
దేవత కలుషితమవదే
నమ్మవే నను నమ్మవే మా అమ్మవే
।।నీతోనే నీతోనే।।
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...