‘ఆర్ఆర్ఆర్’లో తెలుగు కథానాయిక?
ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. లాక్డౌన్ తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు
హైదరాబాద్: ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. లాక్డౌన్ తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు కథానాయికను ఇందులో కీలక పాత్రకు అనుకుంటున్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్యారాజేశ్ ఇప్పుడీ ట్రెండీ ప్రాజెక్టులో నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
చారిత్రక పాత్రలకు ఫిక్షనల్ స్టోరీ జోడించి జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, ఆయన జోడీగా అలియాభట్ నటిస్తోంది. ఇక కొమురం భీమ్గా ఎన్టీఆర్ నటిస్తుండగా ఆయనకు జోడీగా హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్కు జోడీగా, మరో కథానాయికగా ఐశ్వర్యారాజేశ్ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తారక్కు జోడీగా మరో హీరోయిన్కు అవకాశం ఉందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో భీమ్ను ప్రేమించే గిరిజన యువతి పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర నిడివి తక్కువైనా ఎంతో కీలకమని సమాచారం. అలాంటి బరువైన పాత్రకు ఎవరు సరిపోతారా? అని చిత్ర బృందం అన్వేషిస్తుండగా, తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్ పేరు తెరమీదకు వచ్చింది.
నటనలో తొలి అడుగు వేసినప్పటి నుంచే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య. అటు కోలీవుడ్లోనూ, ఇటు టాలీవుడ్లోనూ అవకాశాలు అందుకుంటూ తనని తాను నిరూపించుకుంది. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ ఈ అవకాశం ఇచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. అయితే చిత్ర బృందం ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ‘రెండు జళ్ల సీత’ సినిమా కథానాయకుల్లో ఒకరైన రాజేశ్ తనయ ఐశ్వర్య రాజేశ్. ‘కౌసల్య కృష్ణమూర్తి’తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇప్పటికే విడుదల చేసిన రామ్, భీమ్ టీజర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్