ఐశ్వర్య గురించి వస్తోన్న వార్తలు నమ్మొద్దు

కథానాయిక ఐశ్వర్యా రాజేశ్‌ గురించి వస్తోన్న వార్తలు నమ్మొద్దని ఆమె టీమ్‌ తెలిపింది. ప్రముఖ అథ్లెట్‌ బయోపిక్‌లో ఐశ్వర్య నటించనున్నారనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని వివరించింది...

Published : 18 Mar 2021 17:22 IST

అవన్నీ పుకార్లు మాత్రమే: నటి టీమ్‌

చెన్నై: కథానాయిక ఐశ్వర్యా రాజేశ్‌ గురించి వస్తోన్న వార్తలు నమ్మొద్దని ఆమె టీమ్‌ తెలిపింది. ప్రముఖ అథ్లెట్‌ బయోపిక్‌లో ఐశ్వర్య నటించనున్నారనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని వివరించింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ మహిళా అథ్లెట్‌ శాంతి సౌందరరాజన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఏషియన్‌ గేమ్స్‌లో పతకాన్ని గెలిచిన తొలి తమిళ మహిళగా పేరు తెచ్చుకున్న ఆమె జీవిత చరిత్రపై తీసుస్తున్న సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌ ముఖ్య భూమిక పోషించనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై ఆమె బృందం తాజాగా స్పందించింది. శాంతి సౌందరరాజన్‌ బయోపిక్‌లో ఐశ్వర్య నటించడం లేదని.. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, కాబట్టి ఆ పోస్టులను ఎవరూ నమ్మొద్దని పేర్కొంది. మరోవైపు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ తర్వాత ఐశ్వర్యా రాజేశ్ వరుస ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. ‘భూమిక’, ‘రిపబ్లిక్’, ‘టక్‌ జగదీశ్’, ‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌ చిత్రాల్లో ఆమె భాగమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని