ఐశ్వర్య రాజేష్‌, నిధి అగర్వాల్‌ చెరో లక్ష విరాళం 

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం దాదాపు 3 నుంచి 4 లక్షల కేసులు, 4వేల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

Published : 19 May 2021 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం దాదాపు 3 నుంచి 4 లక్షల కేసులు, 4వేల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా కథానాయికలు ఐశ్వర్యరాజేష్, నిధి అగర్వాల్‌ తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే ఎంతోమంది తమిళ సినీ ప్రముఖులు సైతం తమవంతు సాయంగా కొవిడ్‌పై పోరాటానికి విరాళం అందజేసిన విషయం తెలిసిందే. ఇటీవల సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 50 లక్షలు, వైవిధ్య నటుడు విక్రమ్‌ 30 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చారు. ఇప్పటికే అజిత్, సూర్య, కార్తీ, జయం రవి, ఎఆర్ మురుగదాస్, దర్శకుడు శంకర్ విరాళాలు ఇచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్‌ తెలుగులో నానితో కలిసి ‘టక్‌ జగదీష్‌’, సాయిధరమ్‌ హీరోగా వస్తున్న ‘రిపబ్లిక్‌’లో నటిస్తోంది. తమిళంలో ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ అనే సినిమా చేస్తోంది. నిధి అగర్వాల్‌ - పవన్‌తో కలిసి ‘హరి హర వీరమల్లు’లో నటిస్తోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని