Ajay Devgn: నరేష్ మూవీ రీమేక్లో స్టార్హీరో
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ‘నాంది’ చిత్రంతో విజయం అందుకున్నారు టాలీవుడ్ హీరో నరేష్. ఆయనలోని నటుడ్ని ప్రేక్షకులకు వినూత్నంగా పరిచయం చేసిన ‘నాంది’...
ప్రకటించిన ప్రముఖ నిర్మాణ సంస్థ
హైదరాబాద్: దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ‘నాంది’ చిత్రంతో విజయం అందుకున్నారు టాలీవుడ్ హీరో నరేష్. ఆయనలోని నటుడ్ని ప్రేక్షకులకు వినూత్నంగా పరిచయం చేసిన ‘నాంది’ ఈ ఏడాది ఆరంభంలో విడుదలై టాలీవుడ్లో మంచి ఆదరణ పొందింది. కాగా, తాజాగా ఇప్పుడు అదే చిత్రాన్ని బాలీవుడ్లోకి రీమేక్ చేస్తున్నట్లు అగ్ర నిర్మాణ సంస్థ దిల్రాజు ప్రొడక్షన్స్ ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్దేవ్గణ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించనున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు? కీలకపాత్రల్లో ఎవరు?అనే విషయాలు తెలియాల్సి ఉంది.
బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు నటుడు అజయ్దేవ్గణ్. ప్రస్తుతం ఆయన చేతిలో ‘సూర్యవంశీ’, ‘గంగూబాయ్ కతియావాడీ’, మైదాన్’, ‘థ్యాంక్ గాడ్’, ‘మేడే’ చిత్రాలున్నాయి. వీటితోపాటు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’లో సైతం ఆయన కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.