Ajith Kumar: కొత్త కబురు

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ కొత్త కబురు వినిపించారు. తన 62వ సినిమాని విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు, నిర్మాత

Updated : 20 Mar 2022 09:25 IST

మిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ కొత్త కబురు వినిపించారు. తన 62వ సినిమాని విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు, నిర్మాత సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. అజిత్‌ ప్రస్తుతం తన 61వ సినిమాని హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో చేయనున్నారు. ‘వలిమై’ తర్వాత ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. ఏప్రిల్‌ తొలి వారం నుంచి హైదరాబాద్‌లో  రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీపావళి నాటికి సినిమా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిన వెంట‌నే అజిత్‌ - విఘ్నేశ్‌ల ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుంది. దీన్ని వచ్చే ఏడాది  వేసవిలో  ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్‌ స్వరాలందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని