Nagarjuna: ‘ది ఘోస్ట్‌’ తర్వాత 6 నెలలు విరామం తీసుకుంటా..: నాగార్జున

‘ఘోస్ట్‌’ తర్వాత నా సినిమాలేవీ విడుదలవ్వవు అని ప్రముఖ కథానాయకుడు నాగార్జున చెప్పారు. ఓటీటీ సినిమాలూ చేయాలనుందని తెలిపారు. 

Updated : 30 Sep 2022 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టాలీవుడ్‌ అగ్రహీరోల్లో నాగార్జున ఒకరు. వయసుతో సంబంధం లేకుండా విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాలో కీలకపాత్రలో నటించారు. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఘోస్ట్‌’ అక్టోబర్‌ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత నాగార్జున 6 నెలలు సినిమాలకు బ్రేక్‌ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

‘‘కొవిడ్‌ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రజలు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. దీనికి 6 నెలల సమయం పట్టొచ్చు. ఈ సంవత్సరం ‘ఘోస్ట్‌’ తర్వాత నా సినిమాలేవీ విడుదలవ్వవు. ఇకపై నేను ఓటీటీ సినిమాల్లోనూ నటించాలనుకుంటున్నా. అందుకే ఏదైన కథ విన్న తర్వాత అది  ఓటీటీకి సరిపోతుందా.. థియేటర్‌లో రిలీజ్‌ చేయాలా.. అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను’’ అని నాగార్జున చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని