‘సూర్యవంశీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అక్షయ్‌కుమార్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. రణ్‌వీర్‌సింగ్‌, అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్రలు పోషించారు. పోలీస్‌ నేపథ్యంలోసాగే యాక్షన్‌ కథతో రోహిత్‌శెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు....

Published : 14 Mar 2021 13:53 IST

ముంబయి‌: అక్షయ్‌కుమార్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. రణ్‌వీర్‌సింగ్‌, అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్రలు పోషించారు. పోలీస్‌ నేపథ్యంలోసాగే యాక్షన్‌ కథతో రోహిత్‌శెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ప్రేక్షకుల ఎదురుచూపులకు సమాధానం చెబుతూ ఏప్రిల్‌ 30న ప్రపంచవ్యాప్తంగా ‘సూర్యవంశీ’ని విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని