అక్షయ్‌ మరోసారి అలా కనిపించనున్నారా?

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ‘మిషన్‌ మంగళ్‌’ చిత్ర దర్శకుడు

Published : 08 Dec 2020 16:33 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ‘మిషన్‌ మంగళ్‌’ చిత్ర దర్శకుడు జగన్‌ శక్తి దర్శకత్వంలో ఆయనో చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్‌ రెండు పాత్రల్లో కనిపింబోతున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

‘‘మిషన్‌ మంగళ్‌’ తర్వాత శక్తి, అక్షయ్‌ కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. ఇది పూర్తిస్థాయి సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం. భారీస్థాయి హంగులతో తెరకెక్కబోతుంది. ఇందులో అక్షయ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది ఆయన అభిమానులకు ఎంతో ఆనందకర విషయం’’అని అక్షయ్‌ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం.

వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. గతంలో ‘ఆఫ్లాటూన్‌’, ‘జై కిషన్‌’, ‘రౌడీ రాథోడ్‌’ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు అక్షయ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని