‘బచ్చన్‌పాండే’ వచ్చే ఏడాది వస్తాడు!

బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రధానపాత్రలో ‘బచ్చన్‌ పాండే’తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2022లో జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అక్షయ్‌ తెలిపారు. మొదట 2020 క్రిస్ట్‌మస్‌కు సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతోనే

Published : 23 Jan 2021 17:51 IST

ముంబయి: బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రధానపాత్రలో ‘బచ్చన్‌ పాండే’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2022లో జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు అక్షయ్‌ తెలిపారు. మొదట 2020 క్రిస్మస్‌కు విడుదల చేయాలనే ఉద్దేశంతోనే సినిమాను ప్రారంభించారు. ఇంతలో కరోనా వైరస్‌ విస్తరించడం, లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. తాజాగా జైసల్మేర్‌లో షూటింట్‌ మొదలుపెట్టారు. ప్రస్తుతం అక్షయ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో ‘బచ్చన్‌ పాండే’లుక్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. తలకు ఖాకీ రంగు పాగా, నీలి రంగు కన్నుతో తీక్షణంగా చూస్తున్న అక్షయ్‌ లుక్‌ కలిగిస్తోంది. దానికి కింద క్యాప్షన్‌గా ‘అతని చూపు చాలు! ’అంటూ రాసుకొచ్చారు. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫర్హాద్‌ సాంజీ దర్శకత్వం వహిస్తుండగా, కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

ఇవీ చదవండి!

సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఎమోజీ చూశారా!

సంపూర్ణేష్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం!

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని