Ramcharan: మరోసారి చరణ్‌కు జోడీ అలియా?

రామ్ చరణ్ కథానాయకుడిగా ప్రముఖ తమిళ దర్శకుడు ఓ సినిమా చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ సరసన కథానాయికగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Published : 22 May 2021 23:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రామ్ చరణ్ కథానాయకుడిగా ప్రముఖ తమిళ దర్శకుడు ఓ సినిమా చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ సరసన కథానాయికగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చలు కూడా జరిపారని చెప్పుకుంటున్నారు. అయితే అధికారికంగా ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదు. గతంలో దక్షిణ కొరియాకి చెందిన నటి సుజీ బే, హిందీ నటి కియారా అడ్వాణీల పేర్లు కూడా వినిపించాయి. అయితే వీరిలో ఎవరూ ఫైనల్‌గా రామ్‌చరణ్‌ సరసన నటించే అవకాశం దక్కించుకుంటారో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అలియా భట్‌ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'లో చరణ్‌ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌సీ15’ సినిమా షూటింగ్‌ జులైలోనే ప్రారంభం కానుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని