Gangubai: ‘గంగూబాయి..’ కథ విని అలియా పారిపోయింది: భన్సాలీ
అలియా భట్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడీ’. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు భన్సాలీ ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర
ఇంటర్నెట్ డెస్క్: అలియా భట్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడీ’. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు భన్సాలీ ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం చెప్పారు. ‘గంగూబాయి..’ కథ వినగానే అలియా భట్ కంగారుపడి తన ఆఫీసు నుంచి పారిపోయిందట. ఆ తర్వాత మళ్లీ కలిసి ఓకే చెప్పిందని తెలిపారు.
‘‘ఈ సినిమాలో అలియానే ఎంచుకోవాలని మొదటి నుంచి అనుకున్నాను. అందుకే, నా ఆఫీస్లో కూర్చొని ఆమెకు కథ చెప్పా. అందులో తన పాత్ర గురించి విని అలియా షాక్కి గురైంది. వెంటనే తన బ్యాగును పట్టుకొని ఆఫీస్ నుంచి పారిపోయింది. దీంతో నేను మరో హీరోయిన్ను వెతుక్కోవాల్సి వస్తుందేమోనని అనుకున్నా. కానీ, తర్వాత అలియానే ఫోన్ చేసి మరోసారి కలుద్దామని చెప్పింది. తర్వాత కథ నచ్చి ఒప్పుకుంది. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది’’అని భన్సాలీ చెప్పుకొచ్చారు.
ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయి జీవితచరిత్ర ఆధారంగా భన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే, గంగూబాయి జీవితాన్ని వక్రీకరించి సినిమా తీశారంటూ ఆమె కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాదే ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ కేసు పెండింగ్లో ఉంది. విడుదలపై స్టే ఇచ్చేందుకు ముంబయి హైకోర్టు నిరాకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు