Yamuna: సెంట్రల్ లాక్ వేయకపోవడంతో.. కారు మండుతుండగానే దూకేశా..
అమాయకత్వం..బేలతరం..చూడగానే మనమ్మాయిగా కనిపించే యమున మొదటి సినిమా నుంచే స్టార్ హిరోయిన్గా మారిపోయింది.
ఇంటర్నెట్డెస్క్: అమాయకత్వం.. బేలతనం.. చూడగానే మనమ్మాయిగా కనిపించే యమున మొదటి సినిమా నుంచే స్టార్ హిరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత అన్ని రకాల పాత్రలను పోషించడమే కాదు.. చిన్న తెరపై సత్తా చాటుకుంది. తొలి సినిమా మౌనపోరాటం వచ్చి మూడు దశాబ్దాలు దాటినా.. ఇంకా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అదే పేరుతో బుల్లితెరలో సీరియల్ వస్తోంది.. అందులోనూ యమున నటిస్తోంది. ఆమె ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తన అభిప్రాయాలను పంచుకున్నారిలా..
ఆలీ: ఫైర్బ్రాండ్ పేరెలా వచ్చింది..?
యమున: ముక్కుసూటిగా మాట్లాడుతా. ఏదీ అనిపిస్తే అది మాట్లాడుతాను. మనసులో ఏదీ పెట్టుకోను. ఇది ఎప్పటి నుంచో ఉంది.
మీది చిత్తూరు కదా..? మీవారేం చేస్తారు..? పిల్లలెంతమంది..?
యమున: మాది అసలు బెంగళూరు. కానీ మా పెద్దవాళ్లది చిత్తూరు. పెళ్లి చేసుకొని మళ్లీ చిత్తూరు వెళ్లా. మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీరు. పెద్దమ్మాయి ఎంబీఏ చేస్తోంది. చిన్నమ్మాయి ఇంటర్ చదువుతోంది.
సినిమాల్లో చేసిన మీరు టీవీకి ఎందుకు పరిమితం అయ్యారు..?
యమున: నిజంగా టీవీలో నటించడం సౌకర్యంగా ఉంది. సినిమాలో చేయకూడదని కాదు.. అక్కడ పని చేయాలంటే ఎనర్జీ కావాలి. టీవీలో పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయిపోతోంది. చాలా బాగుంది. ఈ వయస్సులో నాకు అనుకూలంగా ఉంది.
యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టున్నారు..?
యమున: అవునండీ. పెట్టాం. దాంట్లో మోటివేషన్ మొదలెట్టాం.. ఆ తర్వాత సరదా కార్యక్రమాలను కూడా ఇస్తున్నాం. పర్సనల్ విషయాలు అడుగుతున్నారు. అవి కూడా పంచుకుంటున్నా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా.
ఉషాకిరణ్ మూవీస్, ఈటీవీతో అనుబంధం ఎక్కువ కదా..? అదే లేకపోతే ఎక్కడుండేవారు..?
యమున: అసలు నేను ఇండస్ట్రీకి రావాలనుకోలేదు. పదిమంది ఉంటే మాట్లాడాలంటే భయంగా ఉండేది. మా అమ్మతో.. షూటింగ్ చేయను, నాకు రాదు అని చెప్పా. అయితే.. బాలచందర్ను చూడగానే చెప్పలేకపోయా. అలా ఫోర్స్తోనే నటించా. ఆ తర్వాత సినిమాలు చేయాలనే అభిరుచి పెరిగింది. ఏదైనా సాధించి తీరాలని అనుకున్నా. ఇది నాకు పట్టిన అదృష్టం.. మౌనపోరాటం లేకపోతే యమున లేదు. మోహన్గాంధీ దగ్గర చాలా పని నేర్చుకున్నా. ఇపుడు ఆ సినిమా చూస్తే నేనేనా చేసిందనిపిస్తుంది.
దాసరి గారితో చేశారు..? ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు...?
యమున: ఆయన దగ్గర స్పాంటేనిటీ నేర్చుకున్నా. టేక్లోనే డైలాగ్ చెప్పేస్తారు.. వెంటనే చేయాలి. అదే ఆయన దగ్గర తెలుసుకున్నా.
వినోద్కుమార్, మీరు ఎన్ని సినిమాలు చేశారు..?
యమున: ఐదు సినిమాలు చేశాం. జడ్జిమెంటులో నటించాం..కానీ జంటగా కాదు. అయినా పెద్దగా మాట్లాడుకునే వాళ్లం కాదు..హాయ్..బాయ్తోనే సరిపెట్టా.
ఎన్నాళ్ల తర్వాత మళ్లీ మౌనపోరాటం సీరియల్గా రాబోతోంది..?
యమున: దాదాపు 33 ఏళ్ల తర్వాత వస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కూడా అన్నేళ్లు అయ్యింది.
ఏం చదివారు..?
యమున: టెన్త్. తర్వాత పరిశ్రమలోకి వచ్చా.
ఎన్ని సినిమాల్లో నటించారు..? ఎన్ని భాషల్లో చేశారు..?
యమున: 70 సినిమాలు చేశా. తమిళం తక్కువ. ఒరియా, బెంగాలీలో నాగమ్మ సినిమాలో నటించా. మరాఠీలో అడిగితే భాష సమస్య ఉందని చేయలేదు. ఎక్కువగా తెలుగు, కన్నడలోనే చేశాను.
అమ్మానాన్న చేతిలో దెబ్బలు ఎవరు ఎక్కువ తిన్నారు..?
యమున: మా ఇంట్లో ముగ్గురం అక్కాచెల్లెళ్లం. అందులో చివరిదాన్ని నేను. అల్లరి నేనే ఎక్కువగా చేసే దాన్ని. అమాయకంగా మొహం పెట్టేసరికి అక్కకు తన్నులు పడేవి.
శారద గారితో సినిమా అవకాశం వచ్చిందా..? ఎందుకు వద్దనుకున్నారు..?
యమున: మొదటి సినిమాలో సుమన్-నిశాంతి, హరీష్ నేను జంటగా అనుకున్నారు. ఆ తర్వాత పూజ రోజు క్యారెక్టర్ తేడా ఉన్నట్టు తెలియడంతో శారద గారిని అడిగా..నెగెటివ్ అయితే చేయనని చెప్పా. సరే అన్నారు. అక్కడ సితార రిపోర్టర్ ఒక ఫొటో ఇవ్వమన్నారు. లేదుపో..ఇంటి దగ్గర ఉందన్నా.. మర్నాడు వచ్చి ఫొటో అడిగితే మేకప్లో లేని ఫొటో ఇచ్చా. అది నచ్చింది. అదే మౌనపోరాటం సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది. ఈ సినిమాలో జైల్లో సీన్ నాకిష్టమైంది. రాత్రి ఒంటిగంటకు షూటింగ్ ఉండటంతో కోపంతోనే నటించా. అన్నం తెచ్చి ఇచ్చారు. కర్రీస్ లేవా..అని అడిగితే డైరెక్టర్ తిట్టారు. కష్టాల్లో ఉన్నావు అనడంతో కోపంతో నటించా. చాలా బాగుందని ఎస్పీ బాలు కూడా మెచ్చుకున్నారు.
మౌనపోరాటం విజయం తర్వాత బాగా గుర్తింపు వచ్చిందా..?
యమున: రెండో సినిమా జడ్జిమెంట్ షూటింగ్ చేస్తున్నపుడు తణుకులో అభిమానులతో వీధి అంతా బ్లాక్ అయిపోయింది. పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని హోటల్లో కాకుండా ఎవరింట్లోనైనా ఉంచాలని కోరారు.
చెన్నైలో ఓ అవార్డు పంక్షన్లో మీరు పరిచయం చేసుకునే లోపే ఆయనే మీ పేరు చెప్పారట..? ఎవరా స్టార్..?
యమున: ఆయనే కమలహాసన్గారు. మౌనపోరాటం చాలా బాగా చేశావన్నారు. ఎంతో సంతోష పడ్డా. ఆయన చేతుల మీదుగా కళాసాగర్ అవార్డు తీసుకున్నా. రామోజీరావు గారు కూడా అక్కడే ఉన్నారు.
ఏదో షూటింగ్ నుంచి వెళ్తున్నపుడు కార్ యాక్సిడెంట్ అయ్యింది కాదా..?
యమున: తమిళంలో రాధిక వాళ్ల సీరియల్లో అమ్మవారి పాత్ర నాది. కుట్రాలంలో షూటింగ్ చేసుకొని టాటా సఫారిలో బెంగళూరు వెళ్తున్నాం. ఆ దారి సరిగా లేదు. ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయట. ఎదురుగా బస్సు వస్తోంది.. వెనక నుంచి లారీ మమ్మల్ని ఓవర్టేక్ చేసి గుద్దేసింది. చాలా దూరం లాక్కొనివెళ్లింది. బానెట్, పెట్రోల్ ట్యాంకు ఓపెన్ అయ్యాయి. మంటలు వ్యాపించాయి. సెంట్రల్ లాక్ పడకపోవడంతో మండుతున్న కారులో నుంచి వెంటనే దూకేశా. లేకపోతే అంతే సంగతులు. కారు సినిమాలోలాగా మంటల్లో మాడిపోయింది. ఏడాదిపాటు భయం పోలేదు. ఇది 2009 జూన్ 23న జరిగింది.
ఇద్దరమ్మాయిలున్నారు.. అయినా పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నారు. ఎందుకు..?
యమున: రెండో అమ్మాయి పుట్టినపుడే పిల్లలను దత్తత తీసుకోవాలని ఉండేది. అనాథ పిల్లలను చూసినప్పుడు బాధ అనిపించేది. వాళ్లకు అమ్మా నాన్న లేరు కదా.. వాళ్లకు అమ్మనైతే ఎలా ఉంటుందని అనిపించింది. మా అమ్మ వారించింది.. నీ అమ్మాయిలతో సమానంగా చూడకపోతే చూసేవాళ్లు ఏమనుకుంటారు. ఆ అమ్మాయి బాధ పడితే నువ్వు బాధ పడుతావు అంది. అందుకే దత్తత తీసుకోలేదు.
బిర్యానీ, చేపలు, కూరలు అరగంటలో చేస్తాం..మీరు రెండున్నర గంటల్లో ఉప్మా చేశారట..?
యమున: మీకివన్నీ ఎవరూ చెప్పారండి(నవ్వులు). పెళ్లైన కొత్తలో వంట రాదు. ఇంట్లో ఐదుగురున్నారు. టిఫిన్ చేయాలన్నారు. ఆరోగ్యం ముఖ్యమని కూరగాయలను వేయాలనుకున్నా.. వాటిని కట్ చేయడానికి చాలా సమయం పట్టింది. ఉప్పుందా లేదోనని తినడం.. మళ్లీ ఉప్పు వేయడం, కారం తగ్గిందని మళ్లీ వేయడం.. ఇలా ఎక్కువ సమయం అయ్యింది. ఇప్పుడు మాత్రం వంటల్లో నిపుణురాలినయ్యా.
ఈ మౌనపోరాటం ఎలా ఉండబోతోంది..?
యమున: అప్పట్లో కొండలు ఎక్కించారు.. ఇప్పుడూ కొండలు ఎక్కిస్తున్నారు. డైరెక్టర్ ఏదీ చేయమంటే అది చేస్తాను. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. సినిమాలాగానే సీరియల్ ఉండాలని చెప్పడంతో కష్టపడుతున్నాం. మౌనపోరాటం సీరియల్గా చేద్దామని అనుకున్నపుడు ముందుగా వద్దన్నా.. ఆ మౌనపోరాటం రామోజీరావు గారు ఇష్టపడి నిర్మించారు. ఇప్పటికీ గుర్తింపు ఉంది. అయితే బాపినీడుగారు.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. దుర్గ పాత్రకు ఎక్కడా అన్యాయం జరగదు.. సూపర్హిట్ అయిన సినిమాను సీరియల్ చేద్దామనుకుంటున్నామని చెప్పారు. ఇపుడైతే చాలా బాగుంది.
బంగారు కుటుంబం చూసి ఆ డైరెక్టర్ మీకు సినిమా అవకాశం ఇచ్చారట..?
యమున: రామ్గోపాల్వర్మగారు అవకాశం ఇచ్చారు. కూర్చొని ఉన్నా.. నన్ను అలా చూసుకుంటూ వెళ్లారు. నేను అలాగే చూస్తున్నా. కట్ చేస్తే గోవిందా గోవిందా సినిమాలో లక్ష్మీదేవి పాత్ర ఇచ్చారు.
పుట్టింటి పట్టుచీర సినిమా చేస్తున్నపుడు సురేశ్ నీ కంటికి బఫూన్లా కనిపిస్తున్నానా..? అన్నారట ఎందుకు..?
యమున: సరదాగానే అన్నారు. నిజంగా నాకు షూటింగ్ లొకేషన్లో సీరియస్గా ఉంటే నచ్చదు. సరదాగా ఉంటే ఇష్టం. సురేశ్గారు ఎన్ని ఇబ్బందులున్నా ఫన్నీగా మాట్లాడుతారు. జోక్ చెప్పరా.. అంటూ వెంటపడేదాన్ని. నిన్ను నవ్వించడానికి నేను బఫూన్లా కనిపిస్తున్నానా.. అనే వారు.
ఎన్నో కష్టాలను చూసిన మీరు.. ఈ రోజు సంతోషంగా ఉండటం ఎలా సాధ్యమయ్యింది..?
యమున: మన మనస్సేనండి. కొన్ని సంఘటనలతో ఆర్థికంగా, స్థాయిపరంగా తగ్గిపోయా. ఇలాంటి సమయంలో ఇద్దరమ్మాయిలను పెంచడం సాధ్యమయ్యే పని కాదు. లౌక్యం తెలియక చెప్పిన మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్నా. పరిగెత్తడం కన్నా.. ఉన్నదాంట్లో జాగ్రత్తగా ఉందామనుకున్నాం. మనసు గట్టిగా ఉంటే నాలుగు ఇళ్లలోనైనా పని చేసుకొని పిల్లలను పెంచుకోగలమనే నమ్మాను. భయపడితే ముందుకు వెళ్లలేం. భయపడినంతకాలం సమాజం భయపెట్టింది.. ధైర్యంగా ఎదురు తిరిగి నవ్వడం మొదలెట్టా.. ఇపుడు చక్కగా ముందుకు వెళ్లగలుగుతున్నా. సంతోషం.. కారు, బంగ్లా, డబ్బులతో కాదు.. మనసుతోనే ఉంటుంది.
లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్గారు బాలకృష్ణ పక్కన నటించమని అడిగారా..? చిరంజీవి, మోహన్బాబులతో నటించే అవకాశం వచ్చిందా..?
యమున: నాకు ఈ విషయం తెలియదు.. అట్లూరి రామారావుగారు చెప్పారు. ఏ సినిమానో తెలియదు. అప్పట్లో కొత్త.. నాకేం తెలిసేది కాదు. అప్పుడు జడ్జిమెంటు సినిమా చేస్తున్నాం. బాలకృష్ణ సినిమా అలా మిస్ అయ్యింది. చిరంజీవి గారితో కొదమసింహం కూడా అలాగే పోయింది. మంజునాథ సినిమాలో ఒక బిట్ అయినా ఆయనతో చేశా. ఆ సంతోషం చాలు. ఆ షూటింగ్లో గిల్లుకున్నా.. ఇది నిజమా సార్ అని పదేపదే చిరంజీవి గారిని అడిగేదాన్ని. అల్లుడుగారు సినిమాను.. నాకే బ్రెయిన్ సరిగా పని చేయక చేయలేదు. ఆ సినిమా రమ్యకృష్ణను స్టార్ హీరోయిన్గా చేసింది.
మీ చివరి తెలుగు సినిమా ఏదీ..?
యమున: ట్యాక్సీవాలా. ఈ మధ్యలో సినిమా ఛాన్సు వచ్చినా కుదరలేదు.
మౌనపోరాటం సీరియల్లో ఏం చూపించబోతున్నారు..? ఆ పాత్రల్లో ఎవరూ నటిస్తున్నారు..?
యమున: సీరియల్ చూడండి. నేనేమీ చెప్పను. ఆ సినిమాలో దుర్గ పోరాటం తర్వాత మళ్లీ సీరియల్ మొదలవుతుంది. పిల్లలేమయ్యారు..? రాజశేఖర్ మారాడా..?అనే కనిపిస్తుంది. ఒక కొడుకు ఉంటే ఇంకో కొడుకు ఎప్పుడు వచ్చాడు..? ఇవన్నీ తెలియాలంటే సీరియల్ చూడాల్సిందే.(మౌనపోరాటం సీరియల్లో నటించే ముగ్గురు నటీనటులతో కొద్దిసేపు చిట్చాట్ కొనసాగింది)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!