ఎన్టీఆర్‌ అభినందన మర్చిపోలేను: పృథ్వీరాజ్‌

తాను చెప్పిన శకుని డైలాగ్స్‌ విని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఎంతోగానో మెచ్చుకున్నారని నటుడు పృథ్వీరాజ్‌ అంటున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ప్రతి సోమవారం రాత్రి ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి మరో నటుడు

Updated : 30 Jan 2021 18:23 IST

హైదరాబాద్‌: తాను చెప్పిన శకుని డైలాగ్స్‌ విని మహానటుడు ఎన్టీఆర్‌ ఎంతగానో మెచ్చుకున్నారని నటుడు పృథ్వీరాజ్‌ అంటున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి నటుడు కృష్ణభగవాన్‌తో కలిసి వచ్చి ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా కృష్ణభగవాన్‌ తనదైన శైలిలో వెటకారంగా మాట్లాడుతూ... షో ఆసాంతం నవ్వులు పంచారు. అలాగే పృథ్వీరాజ్‌ ‘మంచు దెబ్బ’ వెనుకున్న విషయాలను వివరించటం చాలా ఆసక్తిగా ఉంది. ఎమ్మెస్‌ నారాయణతో చేపల గురించి కృష్ణ భగవాన్‌ పేల్చిన పంచ్‌లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. మరి ఆ సరదా సంభాషణలు, వారిద్దరి సినీ కెరీర్‌ సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సోమవారం దాకా వేచి చూడాల్సిందే. అందాకా ఈ నవ్వుల ప్రోమోను చూసేయండి!

ఇవీ చదవండి!

‘ఖిలాడి’టీమ్‌లో యాక్షన్‌ కింగ్‌!

దయచేసి.. మా ఇంటికి రావొద్దు: శింబు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు