నమ్మించి మోసం చేశారు: జయలలిత

‘ఎన్నో లగ్జరీ కార్లలో తిరిగిన నేను ఈ రోజు క్యాబ్‌లో వెళ్లాల్సిన పరిస్థితి.. వాళ్లు నన్ను నమ్మించి మోసం చేశారు’ అంటూ నటి జయలలిత భోరున విలపించారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి

Published : 04 Mar 2021 01:12 IST

హైదరాబాద్‌: ‘ఎన్నో లగ్జరీ కార్లలో తిరిగిన నేను ఈ రోజు క్యాబ్‌లో వెళ్లాల్సిన పరిస్థితి.. వాళ్లు నన్ను నమ్మించి మోసం చేశారు’ అంటూ నటి జయలలిత భోరున విలపించారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి నటి జయలలితతో పాటు సీనియర్‌ ఆర్టిస్ట్‌ వరలక్ష్మి అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో వారి ప్రయాణం ఎలా మొదలైంది, శంకారభరణంలో వరలక్ష్మి ఎలా నటించింది, వ్యాంప్‌ పాత్రల్లో జయలలిత ఎందుకు చేయాల్సివచ్చిందో షోలో వివరించారు. జయలలితను సీరియల్‌ నిర్మాతలు మోసం చేసిన తీరును వివరిస్తుంటే ప్రతి ఒక్కరు కంటితడి పెట్టుకోక మానరు. సినీ రంగంలో వారి ప్రయాణం ఎలా సాగింది.. జీవితంలో వారు పడిన కష్టాలు, వారికి పేరు తీసుకొచ్చిన సంఘటనలు తెలుసుకోవాలని ఉందా.. అయితే వచ్చే సోమవారం రాత్రి 9:30గంటల వరకు వేచి చూడాల్సిందే. మరి అప్పటిదాకా ఈ ప్రోమోను చూసేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని