Allari Naresh: అల్లరి నరేష్‌ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

ఒకప్పుడు వరుస కామెడీ చిత్రాలతో అలరించిన కథానాయకుడు అల్లరి నరేశ్‌ ‘నాంది’తో రూటు మార్చారు.

Published : 10 May 2022 13:52 IST

హైదరాబాద్‌: ఒకప్పుడు వరుస కామెడీ చిత్రాలతో అలరించిన కథానాయకుడు అల్లరి నరేశ్‌ ‘నాంది’తో రూటు మార్చారు. ఏఆర్‌ రాజమోహన్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 59వ చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఆనంది కథానాయిక. అల్లరి నరేశ్‌ సినీ కెరీర్‌ను ప్రారంభించి 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నరేష్‌ గిరిజన గ్రామం నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది. ఇందులో ఆయన పాత్ర ఏంటి? ఇతర నటీనటులు ఎవరు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే! జీ స్టూడియోస్‌, హర్ష మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్‌ పాకాల సంగీత దర్శకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని