Mahabharata: ‘మహా భారతం’ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది

భారత ఇతిహాసాల్లో ఒకటిగా చెప్పుకునే మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని ‘మహాభారతం’ ప్రాజెక్ట్‌ సిద్ధం చేయనున్నట్లు....

Updated : 10 Sep 2022 16:03 IST

హైదరాబాద్‌: ‘మహాభారతం’ ప్రాజెక్ట్‌ సిద్ధం చేయనున్నట్లు టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ గతంలో ఓసారి వెల్లడించిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నిర్మాత మధు మంతెనతో కలసి ఈ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ బయటకు వచ్చింది. మహాభారతాన్ని సినిమాలా కాకుండా వెబ్‌సిరీస్‌ రూపంలో నిర్మించనున్నారు. డిస్నీప్లస్‌ హాట్‌ స్టార్‌ వేదికగా దీన్ని విడుదల చేయనున్నారు. ‘‘ఇక గొప్ప ఇతిహాసం.. మునుపెన్నడూ చూడని విధంగా మీ ముందుకు రానుంది. ఒక అద్భుత దృశ్య కావ్యం కోసం ఎదురుచూస్తూ ఉండండి’’ అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ పేర్కొంది. అయితే ఈ సిరీస్‌లో ఎవరు నటిస్తున్నారు? దీన్ని ఎవరు తెరకెక్కిస్తున్నారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైధోవర్స్ స్టూడియోస్ సంయుక్తంగా దీన్ని రూపొందిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని