Allu Aravind: నేటితో సమస్యలకు ఎండ్‌ కార్డ్‌: అల్లు అరవింద్‌

ఆంధ్రప్రదేశ్‌ సినిమా టికెట్‌ ధరల వ్యవహారానికి నేటితో ఫుల్‌స్టాప్‌ పడే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. సినిమా టికెట్‌ ధర...

Published : 10 Feb 2022 09:39 IST

సినీ పెద్దల భేటీపై అరవింద్‌ ఏమన్నారంటే

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ సినిమా టికెట్‌ ధరల వ్యవహారానికి నేటితో ఫుల్‌స్టాప్‌ పడే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. ఈ వ్యవహరంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో గురువారం ఉదయం చిరంజీవి, నాగార్జునతోపాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు సమావేశం కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ భేటీపైనే ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలకు నేటితో ముగింపు పడొచ్చని అందరూ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలకు నేటితో ఎండ్‌ కార్డ్‌ పడుతుందని ఆశిస్తున్నాం. ఇండస్ట్రీకి మేలు జరిగేలా ప్రకటన వస్తుందని భావిస్తున్నా. మా కుటుంబం నుంచి చిరంజీవి వెళ్లారు. కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు’’ అని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని