Pushpa2: విశాఖకు ‘పుష్ప’

కథానాయకులు కొన్ని కొన్ని పాత్రలతో సుదీర్ఘ ప్రయాణం చేస్తుంటారు. అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా పుష్పరాజ్‌ పాత్రతో అలాంటి ప్రయాణాన్నే కొనసాగిస్తున్నారు.

Updated : 19 Jan 2023 06:45 IST

థానాయకులు కొన్ని కొన్ని పాత్రలతో సుదీర్ఘ ప్రయాణం చేస్తుంటారు. అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా పుష్పరాజ్‌ పాత్రతో అలాంటి ప్రయాణాన్నే కొనసాగిస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్‌’ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. నేరుగా కొనసాగింపు చిత్రం ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2) సెట్లోకే అడుగుపెట్టారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ క్రమంగా ఊపందుకొంటోంది. ఇటీవలే కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ వారంలో విశాఖపట్నంలో చిత్రీకరణ జరపనున్నారు. అందుకోసం గురువారమే అల్లు అర్జున్‌ విశాఖపట్నం చేరుకోనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పది రోజులకిపైగా అక్కడ చిత్రీకరణ జరపున్నట్టు తెలిసింది. కథానాయికగా నటిస్తున్న రష్మిక (Rashmika) వచ్చే నెలలో ఈ సినిమా సెట్లోకి అడుగు పెడుతున్నట్టు తెలిపారు. ‘పుష్ప: ది రైజ్‌’కి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభించింది. అది దృష్టిలో ఉంచుకుని కొనసాగింపు చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. కథ కూడా విదేశీ నేపథ్యాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని