Allu Arjun: దటీజ్‌ అల్లు అర్జున్‌.. ఆ ప్రకటనకు నో చెప్పారా?

ప్రస్తుతం యువతరంలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న కథానాయకుడు అల్లు అర్జున్‌(Allu arjun).

Published : 20 Apr 2022 01:18 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం యువతరంలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న కథానాయకుడు అల్లు అర్జున్‌(Allu arjun).  స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ, ప్రతి చిత్రానికి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటారు. సినిమాలతో పాటు అప్పుడప్పుడు ప్రకటనల్లోనూ తళుక్కున మెరుస్తారు. తాజాగా బన్ని తీసుకున్న ఓ నిర్ణయం పట్ల అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ద టీజ్‌ బన్ని’ అంటూ ట్వీట్‌లు పెడుతున్నారు.  ఇంతకీ ఏం జరిగిందంటే... ఓ ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ తన బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం అల్లు అర్జున్‌ను సంప్రదించిందట. పొగాకు ఉత్పత్తులు కావడంతో భారీగానే పారితోషికం కూడా ఆఫర్‌ చేసింది. అయితే, మరో ఆలోచన లేకుండా ఆ ప్రకటన చేయనని బన్ని చెప్పారట. తాను అలాంటి ప్రకటనలు చేస్తే, అభిమానులు కూడా తనని చూసి పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడతారని, అందుకే తాను ఆ ప్రకటన చేయనని సన్నిహితులతో అన్నట్లు సమాచారం.  దీంతో బన్ని నిర్ణయం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్‌’లో నటిస్తున్నారు. గతేడాది వచ్చిన ‘పుష్ప:ది రైజ్’కు కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. రష్మిక కథానాయిక. త్వరలోనే ‘పుష్ప2’ సెట్స్‌పైకి వెళ్లనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని