Allu Sirish: పెళ్లి..హిట్ సినిమా లాంటిది!
‘‘హారర్ థ్రిల్లర్ సినిమాలైతే తప్ప... హాస్యం లేకుండా తెలుగు ప్రేక్షకుడికి కథ చెప్పకూడదు. మాతృకలో లేని వినోదాన్ని మేం ప్రత్యేకంగా మేళవించి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది’’ అన్నారు అల్లు శిరీష్.
‘‘హారర్ థ్రిల్లర్ సినిమాలైతే తప్ప... హాస్యం లేకుండా తెలుగు ప్రేక్షకుడికి కథ చెప్పకూడదు. మాతృకలో లేని వినోదాన్ని మేం ప్రత్యేకంగా మేళవించి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది’’ అన్నారు అల్లు శిరీష్ (Allu Sirish). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). తమిళంలో విజయవంతమైన ‘ప్యార్ ప్రేమ కాదల్’కి రీమేక్గా రూపొందిన చిత్రమిది. రాకేష్ శశి దర్శకత్వం వహించారు. చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా అల్లు శిరీష్ శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘కథ బాగా ప్రేరేపిస్తే తప్ప నేను సినిమా చేయను. సినిమా సినిమాకీ మధ్య విరామం రావడానికి కారణం అదే. రాకేష్ శశి, నేను కలిసి సినిమా చేయడం కోసం రెండు మూడుసార్లు కథాచర్చలు కూడా జరిగాయి. కానీ ఆ కథలు కుదరలేదు. ‘ఊర్వశివో రాక్షసివో’ పట్టాలెక్కడానికి కారణం మా నాన్న. ‘ప్యార్ ప్రేమ కాదల్’ ఆయనకి బాగా నచ్చింది. ఇప్పుడు యువతరం ఇలాగే ఉంటుంది కదా, ఈ కాన్సెప్ట్ చాలా బాగుందంటూ సినిమా గురించి పదే పదే చెప్పేవారు. నీకు బాగుంటుందని కూడా నాతో అన్నారు. దాంతో ఆ సినిమాని చూశా. సినిమా చూసినవాళ్లంతా నవ్వుకున్నాం, బాగుందంటూ మెచ్చుకోవడం సంతృప్తినిచ్చింది’’.
* ‘‘మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీకుమార్ అనే యువకుడి పాత్రలో ఒదిగిపోయావని అభినందిస్తున్నారంతా. అయితే ఆ పాత్ర చేయడానికి తెలుగులో చాలామంది యువ హీరోలే కనిపిస్తారు, కానీ సింధూజ పాత్రలో మాత్రం అను ఇమ్మాన్యుయేల్ని తప్ప మరొకరిని ఊహించలేం. తన పాత్రలాగే స్వతంత్య్ర భావాలు, మొండితనం ఉన్న అమ్మాయి తను. అందుకే పాత్రలో అంతగా ఒదిగిపోయిందేమో. మా నాన్న కూడా సినిమా చూశాక అను నటనని మెచ్చుకున్నారు. ‘నా పేరు సూర్య...’ సమయంలో కానీ, అంతకుముందు కానీ ఎప్పుడూ ఇంత అందంగా కనిపించలేదు, ఇందులో చాలా బాగుందన్నారు. శ్రీ కుమార్ పాత్ర విషయంలోనైనా, అనుతో కెమిస్ట్రీ పండటంలోనైనా సెట్స్కి వెళ్లడానికి ముందు మేం చేసిన ముందస్తు సన్నాహాలే. అమాయకమైన కుర్రాడిగా నటించాలన్నప్పుడు ఆ తరహా పాత్రల్ని చూడటం కాకుండా, నిజ జీవితంలోని వ్యక్తుల్ని గమనించి చేయాలనుకున్నా. ఆ పాత్రలాగే మా కజిన్ ఒకరుంటారు. తనకి తెలియకుండానే వీడియోలు తీసి అందుకు తగ్గట్టుగా నటించా’’.
* ‘‘రొమాంటిక్ సన్నివేశాల విషయంలో మాలో ఎలాంటి సందేహాలు లేవు. వీటిని కవితాత్మకంగా తెరపైకి తీసుకొచ్చాం తప్ప, ఎక్కడా అసభ్యంగా ఉండవు. నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉంది. సహజీవనం నది అయితే, పెళ్లి అనేది సముద్రం అనేది నా అభిప్రాయం. సహజీవనంతో ప్రయాణం మొదలుపెట్టి పెళ్లి చేసుకోవడాన్ని ఇష్టపడతా. నా పెళ్లి విషయంలో ఇంట్లో ఒత్తిడేమీ లేదు. పెళ్లనేది కూడా హిట్ సినిమాలాంటిదే. దానంతట అదే రావాలి తప్ప, మనం అనుకుంటే కాదు (నవ్వుతూ).
* ‘‘పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలంటారు కదా. నా తొలి సినిమా ‘గౌరవం’ సామాజికాంశంతో కూడిన కథ. అప్పుడప్పుడే కాలేజీ నుంచి వచ్చిన నేను నా ఆలోచనలకి తగ్గట్టే ఆ కథని ఎంపిక చేసుకుని నటించా. కానీ అలాంటి కథని ఇప్పుడు చేయాల్సిందని చెబుతుంటారు. నేనూ అదే ప్రయత్నంలో ఉన్నాను. కరోనా తర్వాత సినిమాల్ని థియేటర్లో చూడదగ్గదా లేక ఓటీటీల్లో చూసేదా? అని ఆరా తీశాకే ప్రేక్షకుడు ఓ నిర్ణయానికొస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ సినిమాలకి ఇదివరకు ఓ మార్కెట్ ఉండేది. ఇప్పుడది ఓటీటీ జోనర్ అయ్యింది. సింపుల్ డ్రామాలు, పాత్ర ప్రధానమైన కథలు ఓటీటీల్లోనే చూస్తున్నారు. ‘కాంతారా’ తరహా కొత్త నేపథ్యాలు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా సాగే చిత్రాలు, అగ్ర తారల సినిమాలే థియేటర్లకి ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. తదుపరి చేయనున్న సినిమాల కోసం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె