Alluarjun: ఇండియా- పాక్‌ బోర్డర్‌లో స్టైలిష్‌ స్టార్‌...!

స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ వాఘా సరిహద్దుకు వెళ్లి జవాన్లతో సరదాగా గడిపారు.

Updated : 30 Sep 2022 12:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ కుటుంబంతో కలిసి పంజాబ్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న(september 29) ఆయన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరు గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించారు. అక్కడి నుంచి వాఘా సరిహద్దుకు వెళ్లి జవాన్లతో సరదాగా గడిపారు. బీఎస్ఎఫ్‌ జవాన్లతో కలిసి దిగిన ఫొటోలు,వీడియోలను అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ..‘‘బీఎస్‌ఎఫ్‌.. గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు’’ అని రాశారు.  ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

పంజాబ్‌లో అల్లుఅర్జున్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. దీంతో ‘పుష్ప2’లో అతడి గెటప్‌ ఇదే అని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు