AlluArjun: బన్నీ.. మీరు కెమెరా ముందుకొస్తే చాలు.. రూ.10 కోట్లు ఇస్తాం..!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun).. దేశవ్యాప్తంగా ఈయనకున్న క్రేజ్‌ వేరే లెవల్‌. ‘పుష్ప’ తర్వాత ఈయన పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పలు వాణిజ్య సంస్థలు ఈయన్ని తమ ప్రకటనకర్తగా పెట్టుకునేందుకు .....

Published : 11 Aug 2022 10:31 IST

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun).. దేశవ్యాప్తంగా ఆయనకున్న క్రేజ్‌ వేరే లెవల్‌. ‘పుష్ప’ తర్వాత బన్నీ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పలు వాణిజ్య సంస్థలు అల్లు అర్జున్‌ను తమ ప్రకటనకర్తగా పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్స్‌కు కాస్త దూరంగా ఉన్న ఆయన భారీ పారితోషికం తీసుకుంటూ ఆయా ఉత్పత్తులను ప్రమోట్‌ను చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. అయితే, తాజాగా బన్నీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటి? దాని వల్ల ఆయన ఎంత డబ్బుని వదులుకున్నాడంటే..?

‘పుష్ప-2’ పనుల్లో బిజీగా ఉన్న బన్నీ వరుస వాణిజ్య ప్రకటనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఆయన గత కొన్నిరోజుల నుంచి వరుస యాడ్ షూట్స్‌లోనూ పాల్గొంటున్నారు. అలా ఇప్పటికే ఓ శీతలపానీయ ఉత్పత్తుల సంస్థ, బస్సు, స్కూటర్‌ ప్రయాణాలకు సంబంధించిన యాప్స్‌, ఫుడ్‌ డెలివరీ యాప్‌ వంటి వాటికి బన్నీ ప్రకటనకర్తగా కొనసాగుతున్నారు. ఆయా బ్రాండ్ల యాడ్స్‌ కోసం కొన్ని గంటలపాటు పనిచేసినందుకు గానూ ఆయన రూ.7.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. అయితే, ఇటీవల బన్నీకి ఓ పొగాకు ఉత్పత్తుల సంస్థ నుంచి భారీ ఆఫర్‌ వచ్చిందట. తమ యాడ్‌ షూట్‌ కోసం ఒక రోజులో కొన్ని గంటలపాటు కెమెరా ముందుకు వస్తే సుమారు రూ.10 కోట్లు ఇస్తామని బన్నీకి ఆ సంస్థ ఆఫర్‌ ఇచ్చిందట. భారీ మొత్తంలో డబ్బు వస్తున్నప్పటికీ బన్నీ మాత్రం ఆ యాడ్‌కు నో చెప్పారట. తాను అలాంటి ప్రకటనలు చేస్తే అభిమానులు కూడా తనని చూసి పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడతారని.. అందుకే తాను ఆ ప్రకటన చేయనని అన్నారట. ఈ మేరకు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక యాడ్‌ కోసం రూ.10 కోట్లు ఇస్తామన్నా అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేయనని చెప్పడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని