AlluArjun: పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించిన అల్లుఅర్జున్‌

కన్నడ దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబసభ్యుల్ని అల్లు అర్జున్‌ పరామర్శించారు. రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించడం కోసమే గురువారం ఉదయం బెంగళూరుకు చేరుకున్న ఆయన..

Published : 04 Feb 2022 02:06 IST

హైదరాబాద్‌: కన్నడ దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబసభ్యుల్ని అల్లు అర్జున్‌ పరామర్శించారు. రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించడం కోసమే గురువారం ఉదయం బెంగళూరుకు చేరుకున్న ఆయన.. పునీత్‌ సోదరుడు శివరాజ్‌కుమార్‌ ఇంటికి వెళ్లారు. పునీత్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కొంతసయమంపాటు మాట్లాడారు. పునీత్‌తో తనకున్న మధురజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం దక్షిణాది చిత్రపరిశ్రమ తీరని లోటుగా మిగిలింది. పునీత్‌ ఆకస్మిక మరణంపట్ల సంతాపం ప్రకటిస్తూ ఇప్పటికే పలువురు తారలు ఆయన కుటుంబాన్ని కలిసి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలోనే గతేడాది బెంగళూరులో జరిగిన ‘పుష్ప’ ప్రీరిలీజ్‌ వేడుకలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. పునీత్‌ తనకెంతో ఆప్తుడని.. ఆయన మరణం తనని కలచివేసిందన్నారు. ప్రీరిలీజ్‌ వేడుక కోసమే బెంగళూరుకి తాను వచ్చానని, ఈ సమయంలో పునీత్‌ కుటుంబాన్ని కలిస్తే అందరూ దీన్ని కూడా పబ్లిసిటీ అనుకుంటారని.. అందుకే తాను సమయం చూసుకుని వచ్చి కలుస్తానని అప్పట్లో చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా బెంగళూరుకు వెళ్లి పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని