AlluArjun: ‘పుష్ప’.. సిద్ధ్‌శ్రీరామ్‌ చేసిన పనికి ఆశ్చర్యపోయిన బన్నీ

మేజికల్‌ వాయిస్‌తో అందర్నీ కట్టిపడేస్తున్నారు గాయకుడు సిద్ద్‌ శ్రీరామ్‌. ప్రస్తుతం టాలీవుడ్‌ ఆయన ట్రెండే నడుస్తోంది. ఆయనతో తమ సినిమాలో పాట పాడించుకునేందుకు...

Updated : 30 Jan 2022 11:29 IST

హైదరాబాద్‌: తన మధురమైన వాయిస్‌తో అందర్నీ కట్టిపడేస్తున్నారు గాయకుడు సిద్ధ్‌ శ్రీరామ్‌. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆయన ట్రెండే నడుస్తోంది. ఇక ‘పుష్ప’ చిత్రంలో ఆయన ఆలపించిన ‘శ్రీవల్లి’ ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనపై ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘పుష్ప’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని బన్నీ తాజాగా బయటపెట్టారు.

‘‘విశ్రాంతిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. ‘పుష్ప’ ప్రీరిలీజ్‌ వేడుకలో నా సోదరుడు సిద్ధ్‌ శ్రీరామ్‌ స్టేజ్‌పై అందరి ముందు ‘శ్రీవల్లి’ పాట లైవ్‌లో పాడుతున్నప్పుడు ఇది జరిగింది. అతడు పాట పాడటం ప్రారంభించిన తర్వాత మ్యూజిషియన్స్‌ ఎలాంటి వాయిద్యాన్ని ప్లే చేయకుండా చూస్తూ అలాగే ఉండిపోయారు. కానీ.. శ్రీరామ్‌ మాత్రం పాడటం ఆపలేదు. సంగీతం లేకుండానే పాట పాడుతూ అందర్నీ ఆలరించారు. ఆయన పాట ఎంతో అద్భుతంగా సాగింది. ఆ సమయంలో నాకేమనిపించిందంటే.. అతడికి మ్యూజిక్‌తో పనిలేదు.. ఎందుకంటే అతడే మ్యూజిక్‌ కాబట్టి’’ అని బన్నీ పొగిడారు. మరోవైపు బన్నీ ప్రశంసలపై సిద్ధ్‌ శ్రీరామ్‌ స్పందించారు. ఆ మాటలు తనకు ప్రపంచంతో సమానమని అన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని