Amitabh Bachchan: ‘షోలే’ చిత్రంలో ఆ సీన్ షూట్ చేసేందుకు మూడేళ్లు పట్టింది
బాలీవుడ్లో విడుదలైన క్లాసిక్ చిత్రాల్లో ఒకటి ‘షోలే’. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని, జయాబచ్చన్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం 1975లో విడుదలవ్వగా.. అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ సన్నివేశం గురించి ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నారు బిగ్బి అమితాబ్. ఆయన హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలే చిత్రం రీయూనియన్కి వేదికైంది...
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్లో విడుదలైన క్లాసిక్ చిత్రాల్లో ‘షోలే’ ఒకటి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని, జయాబచ్చన్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం 1975లో విడుదలవ్వగా.. అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ సన్నివేశం గురించి ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నారు బిగ్బి అమితాబ్. ఆయన హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలే చిత్రం రీయూనియన్కి వేదికైంది. ఈ క్విజ్ షోకి షోలే దర్శకుడు రమేష్ సిప్పి, హీరోయిన్ హేమామాలిని కంటెస్టెంట్స్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా అలనాటి షోలే జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఇక అమితాబ్ మాట్లాడుతూ.. ‘షోలో చిత్రంలో నేను మౌతార్గన్ ప్లే చేస్తుండగా.. జయా బచ్చన్ దీపాలు వెలిగించే సన్నివేశం ఉంది. దాన్ని సూర్యాస్తమయం వేళ షూట్ చేద్దామని మా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ (డీఓపీ) దివేచా అన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ.. రమేష్ జీ కేవలం ఆ సన్నివేశం అనుకున్నట్లు రావాలని మూడేళ్లు శ్రమించారు. మొత్తానికి ఆ షాట్ విజయవంతంగా వచ్చింది’’ అని చెప్పారు. షోలే విడుదలై 46ఏళ్లైనా ఇప్పటికీ ఆ చిత్రానికి ఉండే క్రేజ్ వేరు. ‘వీరూ’ పాత్ర పోషించిన ధర్మేంద్ర వీడియో కాల్లో 28మైళ్ల దూరం నడిచాననే సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన దేనికోసం నడిచారు? దర్శకుడు రమేష్ ‘జై’ పాత్రకు ఎందుకు అమితాబ్నే ఎంచుకున్నారు? షోలో జై, వీరు పాత్రల డైలాగ్స్ని హేమామాలిని ఎలా చెప్పారు.. వీటితో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే కేబీసీ 13 షోలే రీయూనియన్ ఎపిసోడ్ వీక్షించాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె