Akhil Akkineni: ప్రభాస్‌ని కలిస్తే జాగ్రత్తగా ఉండాలి: అఖిల్‌

ఎవరైనా ప్రభాస్‌ని కలిస్తే జాగ్రత్తగా ఉండాలని అఖిల్‌ అక్కినేని అన్నారు. ‘అవును’ అంటూ శర్వానంద్‌ ఆయనకు వంతపాడారు.

Published : 05 Sep 2022 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరైనా ప్రభాస్‌ (Prabhas)ని కలిస్తే జాగ్రత్తగా ఉండాలని అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) అన్నారు. ‘అవును’ అంటూ శర్వానంద్‌ (Sharwanand) ఆయనకు వంతపాడారు. ఈ ఇద్దరు ఎందుకు కలిశారు? ప్రభాస్‌ గురించి ఎప్పుడు మాట్లాడారు? అనే సందేహంలో ఉన్నారా? శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) చిత్రం ఈ నెల 9న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో ‘అమ్మ చేతి వంట’ అనే చిట్‌చాట్‌ని ప్లాన్‌ చేసింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అమల అక్కినేని (Amala Akkineni) తోపాటు శర్వానంద్‌, అఖిల్‌ ‘అమ్మ చేతి వంట’లో పాల్గొని, రుచి చూశారు. తాను వంట చేస్తున్న సమయంలో ‘ప్రభాస్‌ ఫూడీ (ఆహారాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి) అని విన్నా’ అని అమల చెప్పగా.. తనను కలిస్తే జాగ్రత్తగా ఉండాలని అఖిల్‌ నవ్వుతూ సమాధానం ఇస్తారు. ‘ఇక చాలు తినలేను అని చెప్పినా ప్రభాస్‌ వదిలిపెట్టరు’ అనే ఉద్దేశంలో అఖిల్‌ మాట్లాడారు.

ప్రభాస్‌ అతిథ్యం స్వీకరించటం కష్టమని ఎందరో తారలు చెప్పిన సందర్భాలెన్నో ఉన్నాయి.  ప్రస్తుతం ‘అమ్మ చేతి వంట’ ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది. ఫుల్‌ వీడియో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలకానుంది. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో నూతన దర్శకుడు శ్రీ కార్తీక్‌ తెరకెక్కించిన చిత్రమిది. రీతూ వర్మ కథానాయిక. ఈ సినిమాలో శర్వానంద్‌ తల్లిగా అమల నటించారు. ఈ కథ తన హృదయాన్ని హత్తుకుందని వివరిస్తూ.. శర్వానంద్‌ తనకు మూడో అబ్బాయిగా మారాడని అమల ఇటీవల తన మనసులోని మాట పంచుకున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని